ఏపీలో కొత్త మంత్రులకు చిక్కు!: సచివాలయంలో చాంబర్లు లేవు!
ఎల్లుండి (ఏప్రిల్ 2)న ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనుంది. ఏపీలో సీఎం సహా 26 మంది మంత్రులు ఉండవచ్చు. ప్రస్తుతం ఆ సంఖ్య 20గా ఉంది. ఇప్పుడు 24 నుంచి 26కు ఆ సంఖ్య పెరగవచ్చు.
అమరావతి: ఎల్లుండి (ఏప్రిల్ 2)న ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనుంది. ఏపీలో సీఎం సహా 26 మంది మంత్రులు ఉండవచ్చు. ప్రస్తుతం ఆ సంఖ్య 20గా ఉంది. ఇప్పుడు 24 నుంచి 26కు ఆ సంఖ్య పెరగవచ్చు.
మంత్రుల సంఖ్య పెరిగితే కొత్త చిక్కు వచ్చి పడింది. కొత్త సచివాలయంలో ప్రస్తుతం 19 చాంబర్లే ఉన్నాయి. కొత్త మంత్రులు వస్తే ఛాంబర్ ఎక్కడ ఇవ్వాలన్న అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

రెండో బ్లాక్లో అయిదుగురు, మూడో బ్లాక్లో ముగ్గురు, నాలుగో బ్లాక్లో ఆరుగురు, అయిదో బ్లాక్లో అయిదుగురు మంత్రులకు ఛాంబర్లు కేటాయించారు.
మంత్రి వర్గ విస్తరణ చేపట్టాక మరో నలుగురైదుగురు మంత్రులుగా బాధ్యతలు చేపట్టే అవకామున్న నేపథ్యంలో వారికి ఛాంబర్ల కేటాయింపు ఎలా చేపట్టాలన్న అంశంపై సీఆర్డీఏ, సాధారణ పరిపాలన అధికారులు చర్చలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications