వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిపై వెనక్కి అసాధ్యం, ఇబ్బంది పెట్టేందుకే: డిగ్గీ ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

No going back on Telangana: Digvijay
న్యూఢిల్లీ: అన్ని పార్టీలను సంప్రదించిన తర్వాతే తాము తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామని, ఈ పరిస్థితుల్లో వెనక్కి పోవడం అసాధ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ మంగళవారం పునరుద్ఘాటించారు. పార్టీలు అన్ని తెలంగాణపై లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చాకనే తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇప్పుడు వెనక్కి వెళ్లడం కుదరదని కుండబద్దలు కొట్టారు.

సీమాంధ్ర, తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టేందుకే ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రులలో రోగులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఉద్యోగులు వెంటనే సమ్మెను విరమించాలని కోరుతున్నానన్నారు. ఉద్యోగులు సమ్మె చేస్తున్నందున విద్యుత్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు.

కేబినెట్ సమావేశం

మరోవైపు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశానికి రాష్ట్రం నుండి జైపాల్ రెడ్డి, కావూరి సాంబశివ రావులు హాజరయ్యారు. ఈ సమావేశానికి కిషోర్ చంద్రదేవ్, పళ్లం రాజులు హాజరు కాలేదు.

ఈ కేబినెట్ భేటీలో ఆంధ్రప్రదేశ్‌లోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. సీమాంధ్రలో ఉద్యమం, నలుగురు కేంద్రమంత్రుల రాజీనామా చర్చకు రానుంది.

English summary
AP Congress incharge Digvijay Singh on Tuesday said there is no going back on Telangana now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X