వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టిపై వెనక్కి అసాధ్యం, ఇబ్బంది పెట్టేందుకే: డిగ్గీ ఆగ్రహం
సీమాంధ్ర, తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టేందుకే ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రులలో రోగులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఉద్యోగులు వెంటనే సమ్మెను విరమించాలని కోరుతున్నానన్నారు. ఉద్యోగులు సమ్మె చేస్తున్నందున విద్యుత్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు.
కేబినెట్ సమావేశం
మరోవైపు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశానికి రాష్ట్రం నుండి జైపాల్ రెడ్డి, కావూరి సాంబశివ రావులు హాజరయ్యారు. ఈ సమావేశానికి కిషోర్ చంద్రదేవ్, పళ్లం రాజులు హాజరు కాలేదు.
ఈ కేబినెట్ భేటీలో ఆంధ్రప్రదేశ్లోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. సీమాంధ్రలో ఉద్యమం, నలుగురు కేంద్రమంత్రుల రాజీనామా చర్చకు రానుంది.
Comments
English summary
AP Congress incharge Digvijay Singh on Tuesday said there is no going back on Telangana now.
Story first published: Tuesday, October 8, 2013, 11:29 [IST]