పవన్కు క్రెడిట్ ఇవ్వని చిరు, బాబు హామీపై రఘువీరా
హైదరాబాద్: తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి విజయానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా తోడయిందని స్వయంగా ఆ పార్టీలే చెబుతూ.. పవర్ స్టార్ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్న నేపథ్యంలో... ఆ క్రెడిట్ తన సోదరుడికి ఇచ్చేందుకు చిరంజీవి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు.
సోమవారం చిరంజీవి సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ వైఫల్యం పైన స్పందించారు. పవన్ కళ్యాణ్ ప్రభావం కాంగ్రెసు పార్టీ పైన పడలేదని ఆయన చెప్పారు. తమ పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

బాబు మాట నిలబెట్టుకుంటారు: రఘువీరా
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తన హామీలను నిలబెట్టుకుంటారని భావిస్తున్నామని ఎపిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి చెప్పారు. రైతులు రుణమాఫీ పైన ఆందోళన చెందవద్దన్నారు. బాబు మాట నిలబెట్టుకుంటారన్నారు. రుణమాఫీని టిడిపి తక్షణమే అమలు చేయాలన్నారు.
రైతులకు రుణమాఫీ చేయాలని కొత్త రుణాలు ఇవ్వాలని గవర్నర్ను కోరుతామన్నారు. చంద్రబాబు రుణమాఫీ పైనే తొలి సంతకం చేయాలన్నారు. తాము ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసినా పోటీ చేశామని చెప్పారు. ఓటమి భయంతో తాము జెసి దివాకర్ రెడ్డిలా పారిపోలేదని ఎద్దేవా చేశారు.
మెడికల్ ఎంట్రన్స్ పాత పద్ధతిలోనే: బొత్స
మెడికల్ ఎంట్రెన్స్ పాత పద్ధతిలోనే నిర్వహించాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రయివేటు మాఫియా చేతుల్లోకి ఎంసెట్ను వెళ్లనివ్వద్దన్నారు. విద్యార్థులు, యువతకు అండగా ఉంటామని బొత్స సత్యనారాయణ చెప్పారు.
ఓటమిపై సమీక్ష
సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ఓటమి పైన సమీక్షపార్టీ కార్యకలాపాలు సీమాంధ్రలోనే నిర్వహించాలని వారు నిర్ణయించారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications