చంద్రబాబుకు షాక్, కూకట్పల్లిలో సుహాసిని తరఫున రోడ్డుషోకు నో పర్మిషన్: కారణమిదే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ పోలీసుల నుంచి షాక్ తగిలింది. మహాకూటమి పొత్తులో భాగంగా కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున నందమూరి సుహాసిని పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా టీడీపీ అధినేత గురువారం రోడ్డు షో నిర్వహించాలనుకున్నారు.
ఇందుకోసం పోలీసుల అనుమతి అడిగారు. గురువారం కూకట్పల్లిలో సుహాసిని తరఫున రోడ్డు షో నిర్వహణకు అనుమతి కావాలని కోరగా, పోలీసులు నిరాకరించారు. అందుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల తారక రామారావు రోడ్డు షోకు అనుమతి ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఒకేరోజు ఇద్దరికి అనుమతి ఇవ్వలేమని పోలీసులు తెలిపారు.

కాగా, ఖమ్మం బహిరంగ సభతో తెలంగాణలో చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత హైదరాబాదులో సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రేపు కూకట్పల్లిలో సుహాసినికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని భావించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రోడ్ షోకు అనుమతి నో చెప్పారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications