వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. జ‌న‌వ‌రి 1న దేవాల‌యాల్లో పూజ‌ల‌కు నో ప‌ర్మిష‌న్‌!

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఆలయాల్లో జనవరి 1న ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు చేపట్టరాదని దేవాదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేవాదాయశాఖకు అనుబంధంగా పనిచేస్తున్న హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు ఆదేశాలు జారీ చేసింది

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఆలయాల్లో జనవరి 1న ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు చేపట్టరాదని దేవాదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేవాదాయశాఖకు అనుబంధంగా పనిచేస్తున్న హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆంగ్లేయులు అలవాటు చేసిన నూతన సంత్సరాదిని నిర్వహించుకోవటం భారతీయ వైదిక విధానం కాదని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. అందుకే కొత్త సంవత్సరం రోజున ఆలయాల్ని అలంకరించటం, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయటం, శుభాకాంక్షలు తెలపడం సరికాదని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

temple

ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు సందేశం పంపారు. భారతీయ సంప్రదాయం కానివాటి కోసం హిందూ ఆలయాల్లో డబ్బు ఖర్చు చేయడం సరికాదని అధికారుల అభిప్రాయం. తెలుగు సంవత్సరాది ప్రకారం ఉగాది రోజున మాత్రమే వేడుకలు జరపాలని దేవాదాయశాఖ కమిషనర్‌ అనురాధ సూచించారు.

ఈ ఆదేశాలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆన్ని ఆలయాల కార్యనిర్వహణాధికారులతో పాటు సహాయక కమిషనర్లు, ఉప కమిషనర్లు, మేనేజర్లకు సమాచారమిచ్చారు.

English summary
Celebrations on January 1st is the western tradition, not ours.. that is why Government of Andhra Pradesh taken a key decesion stating that No pujas will be performed in Temples on that day. Regarding this orders are passed to all the temples in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X