ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జనవరి 1న దేవాలయాల్లో పూజలకు నో పర్మిషన్!
ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆలయాల్లో జనవరి 1న ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు చేపట్టరాదని దేవాదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేవాదాయశాఖకు అనుబంధంగా పనిచేస్తున్న హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు ఆదేశాలు జారీ చేసింది
అమరావతి:
ఆంధ్రప్రదేశ్లోని
అన్ని
ఆలయాల్లో
జనవరి
1న
ప్రత్యేక
పూజలు,
కార్యక్రమాలు
చేపట్టరాదని
దేవాదాయశాఖ
నిర్ణయించింది.
ఈ
మేరకు
దేవాదాయశాఖకు
అనుబంధంగా
పనిచేస్తున్న
హిందూ
ధర్మపరిరక్షణ
ట్రస్టు
ఆదేశాలు
జారీ
చేసింది.
ఆంగ్లేయులు
అలవాటు
చేసిన
నూతన
సంత్సరాదిని
నిర్వహించుకోవటం
భారతీయ
వైదిక
విధానం
కాదని
ఆ
ఆదేశాల్లో
పేర్కొన్నారు.
అందుకే
కొత్త
సంవత్సరం
రోజున
ఆలయాల్ని
అలంకరించటం,
స్వాగత
తోరణాలు
ఏర్పాటు
చేయటం,
శుభాకాంక్షలు
తెలపడం
సరికాదని
దేవాదాయశాఖ
ఉన్నతాధికారులు
భావిస్తున్నారు.
ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు సందేశం పంపారు. భారతీయ సంప్రదాయం కానివాటి కోసం హిందూ ఆలయాల్లో డబ్బు ఖర్చు చేయడం సరికాదని అధికారుల అభిప్రాయం. తెలుగు సంవత్సరాది ప్రకారం ఉగాది రోజున మాత్రమే వేడుకలు జరపాలని దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ సూచించారు.
ఈ ఆదేశాలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆన్ని ఆలయాల కార్యనిర్వహణాధికారులతో పాటు సహాయక కమిషనర్లు, ఉప కమిషనర్లు, మేనేజర్లకు సమాచారమిచ్చారు.