పోలీస్ విధుల్లో...రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా...పట్టించుకోం: డీజీపీ మాలకొండయ్య
అనంతపురం: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు కొన్ని సమస్యల పరిష్కారం కోసం తమను అడుగుతుంటారని, అయితే వాటిని ఒత్తిళ్లుగా భావించకూడదని ఎపి డిజిపి మాలకొండయ్య చెప్పారు. ఒక వేళ పోలీస్ విధుల్లో తమపై ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా...చట్టప్రకారమే ముందుకెళ్తామని రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య స్పష్టం చేశారు.
అనంతపురం నగరంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని ఇండోర్ స్టేడియంలో షటిల్ కోర్టును డీజీపీ ఆదివారం ప్రారంభించారు. డీజీపీతో పాటు ఐజీ, డీఐజీ, జిల్లా ఎస్పీలు కాసేపు షటిల్ ఆడి అందర్నీ అలరించారు. అనంతరం ఫ్యాక్షన్ పికెట్స్ సిబ్బందికి మంచాలు, వంట సామాగ్రిని అందజేశారు. అనంతరం డిజిపి మాలకొండయ్య మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సమాజంలో వైట్ కాలర్ నేరాలు పెరిగిపోతున్నాయని, అయితే తమ దృష్టికి వచ్చిన వాటిపై...పోలీసు పరిధిలో ఉన్న వాటిపై తప్పకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే అగ్రిగోల్డ్ తరహాలో అధిక వడ్డీలు ఇస్తామంటూ ప్రజలను మోసం చేసే సంస్థల ఆగడాలను మాత్రం ఆదిలోనే తుంచేసే ప్రయత్నం చేస్తున్నామని ఎపి డీజీపీ వెల్లడించారు. అనంతరం ఆయన అనంతపురం జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారులతో డిజిపి సమీక్ష నిర్వహించారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications