అజ్ఞాతవాసికి ఏపీ 'ప్రత్యేక' అనుమతి, జూ.ఎన్టీఆర్ సినిమాపై మాత్రం ఇలా, కానీ
హైదరాబాద్/అమరావతి: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా ప్రత్యేక షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఓకే చెప్పింది. రోజుకు నాలుగు సినిమాలకు తోడు మరో మూడు ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది.
దీంతో రోజుకు ఒక్కో థియేటర్లో రోజుకు ఏడు షోలు ప్రదర్శించబడతాయి. సాధారణంగా ఉదయం పది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు నాలుగు షోలు ఉంటాయి. అర్ధరాత్రి ఒకటి గంటల నుంచి ఉదయం పది గంటల వరకు కూడా ప్రత్యేకంగా మూడు షోలకు అనుమతించింది.

అజ్ఞాతవాసికి ఓకే, జైలవకుశకు నో
అజ్ఞాతవాసి సినిమాకు మరో మూడు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కొందరు గత ఏడాది విడుదలైన జై లవ కుశ అంశాన్ని తెరపైకి తెచ్చారు. జై లవ కుశ ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని గుర్తు చేస్తున్నారు. ఏపీతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక షోలకు నిరాకరించింది.
Recommended Video


సోషల్ మీడియాలో పోస్టులు
జై లవ కుశ సినిమా ప్రత్యేక షోలకు చంద్రబాబు ప్రభుత్వం నిరాకరించిందని, కానీ అజ్ఞాతవాసి సినిమాకు జనవరి 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అనుమతి ఇచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

జైసింహాకు కూడా నో చెప్పిన ఏపీ ప్రభుత్వం
ఇక్కడ, మరో విషయం కూడా ఉంది. అజ్ఞాతవాసి సినిమా ప్రత్యేక షోలకు అనుమతించిన ప్రభుత్వం.. నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నటించిన జైసింహా చిత్రానుకు మాత్రం ప్రత్యేక షోలకు అనుమతి నిరాకరించింది. బాలకృష్ణ స్వయంగా చంద్రబాబు బావమరిది. ఎమ్మెల్యే.

అంతకుముందు ఈ సినిమాలకు ఇచ్చారు
అయితే, అంతకుముందు గౌతమీపుత్ర శాతకర్ణి ప్రత్యేక షోలకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణతో పాటు ఏపీలో అనుమతించారు. అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకు వచ్చిన బాహుబలి చిత్రానికి కూడా ప్రత్యేక షోలకు అనుమతించారు.
-
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !!












Click it and Unblock the Notifications