అదర బెదర: సోషల్ మీడియా పోస్టులపై ముద్రగడ పద్మనాభం.. మరో లేఖ
కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల కాపు, బీసీ, దళిత నేతలకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. పల్లకీ మోసింది చాలు.. ఇక మనం ఎక్కాల్సిన సమయం ఆసన్నమైందని అందులో పేర్కొన్నారు. అయితే దీనిని కొందరు తప్పుపడుతున్నారు. పద్మనాభాన్ని దూషిస్తూ మరీ కామెంట్ చేస్తున్నారు. దీనిపై ఆయన స్పందించారు. తాను ఎవరికీ భయపడనని స్పష్టంచేశారు. ఈ మేరకు మరో లేఖ రాశారు. పోస్టులు చేసిన వారిపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
జనాభా తక్కువ ఉన్న జాతులే అధికారాన్ని అనుభవించాలా? అని ఇటీవల ముద్రగడ ప్రశ్నించారు. అధిక జనాభా ఉన్న మన జాతులు అధికార పీఠంపై కూర్చోవాలని పిలుపునిచ్చారు. ముద్రగడకు విమర్శల తాకిడి కూడా తగులుతోంది. లేఖపై కామెంట్లు రాగా.. విమర్శలపై ముద్రగడ పద్మనాభం స్పందించారు. మరో బహిరంగ లేఖను రాశారు. అందులో తనను విమర్శించే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఇటీవల రాజకీయాల్లో నల్లటి బురద రాసుకుని ఇతరులకు అంటించడం పరిపాటి అయిందని అందులో పేర్కొన్నారు. పని చేస్తున్న వారిని దొంగలు, దగాకోరులు అని చెప్పించడం సాధారణ అంశంగా మారిందని అన్నారు. కాపు, బీసీ, దళిత వర్గాలను ఏకం చేయాలని ఆకాంక్షిస్తూ తాను రాసిన లేఖపై విమర్శలు చేస్తున్నారని, సోషల్ మీడియాలో తనను బండ బూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ మంచి పద్దతి కాదన్నారు.
కానీ తను ఇలాంటి పోస్టులకు తాను భయపడనని, పారిపోనని తేల్చిచెప్పారు. బంతి మాదిరి ఎంత బలంగా కొడితే అంత వేగంగా పైకి లేస్తానని చెప్పారు. వాస్తవం చెబితే కొందరు జీర్ణించుకోవడం లేదని చెప్పారు. బలహీన వర్గాలకు రాజ్య అధికారం వద్దా అని పద్మనాభం మరోసారి ప్రశ్నించారు. కాపు రిజర్వేసన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఆందోళన బాట పట్టారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో దీక్ష చేసి సంచలనం రేకెత్తించారు. బస్సు రోకో, రైల్ రోకో చేపట్టి ప్రభుత్వంలో వణుకు తీసుకొచ్చారు. కానీ రిజర్వేషన్ల ఊసును ప్రభుత్వాలు మరచిపోయాయి.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications