ఎన్టీఆర్ విగ్రహం తరలింపు: వైసీపీ ఎమ్మెల్యేకు నందమూరి బాలకృష్ణ ఫోన్
నెల్లూరు: జిల్లాలోని కావలి పట్టణంలో ముసునూరులో మహాలక్ష్మమ్మ ఆలయ స్థలంలో ఆలయానికి ఎదుట రెండేళ్ల క్రితం ఓ టీడీపీ నేత ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించడంపై హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ స్పందించారు.
కాగా, తొలగించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద ప్రతిష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడంపై పలువురు టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.. ఎన్టీఆర్ విగ్రహం తొలగించడంపై అధికార వైసీపీ నేతలపై మండిపడ్డారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వాస్తవ పరిస్థులను నందమూరి బాలకృష్ణకు వాట్సాప్ ద్వారా తెలియజేశారు. దీంతో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి గురువారం బాలకృష్ణ పోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి తీసుకున్న చొరవను అభినందినట్లు తెలిసింది.
అంతేగాక, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కూడా ఈ విషయంపై బాలకృష్ణ మాట్లాడారు. కాగా, రాజమండ్రి నుంచి కొత్తగా కొనుగోలు చేసిన ఎన్టీఆర్ విగ్రహం ముసునూరుకు చేరుకోవడంతో విగ్రహాన్నిప్రతిష్టించేందుకు పనులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పినట్లుగానే విగ్రహాన్ని ముసునూరు కూడలిలోని బస్ షెల్టర్ వద్దనే ఏర్పాటు చేస్తున్నారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications