గోదావరి తీరంపై ఎన్టీఆర్ విగ్రహానికి వ్యతిరేకత
రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ నటుడు ఎన్టీ రామారావు విగ్రహ ప్రతిష్టాపనకు రాజమండ్రి స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పుష్కరాల సందర్భంగా గోదావరి తీరంపై ఎన్టీ రామారావు విగ్రహాన్ని ప్రతిష్టించడానికి తెలుగుదేశం ప్రభుత్వం పూనుకుంది. అయితే, అందుకు స్థానికులు అభ్యంతరం చెబుతున్నారు.
స్థానిక వైతాళికుల విగ్రహాలు మాత్రమే ఉండాలని స్థానికులు పట్టుబడుతున్నారు. ఈ ప్రాంతంతో సంబంధం లేని విగ్రహాల ప్రతిష్టాపనను తాము అంగీకరించబోమని అంటున్నారు. స్థానిక మహానుభావుల విగ్రహాల ప్రతిష్టాపనకు మాత్రమే అంగీకరిస్తామని చెబుతున్నారు.

వేంగి చాళుక్య రాజు రాజరాజనరేంద్రుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు, ఆదికవి నన్నయ్య, గోదావరి దేవత, శివుడు వంటి విగ్రహాలను మాత్రమే నెలకొల్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే అయినప్పటికీ రాజమండ్రి వాస్తవ్యులు కారు. ఆయన కృష్ణా జిల్లా నిమ్మకూరుకు చెందినవారు. దాంతో రాజమండ్రి వద్ద గోదావరి తీరంపై ఎన్టీ రామావు విగ్రహాన్ని ప్రతిష్టంచే ఆలోచనను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications