విజయవాడలోని మరో స్టేషన్ లో ఈ 6 రైళ్లకు స్టాప్..! ఈ తేదీల్లో స్పెషల్..

ఏపీలోని విజయవాడ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ జంక్షన్ మీదుగా రాకపోకలు సాగించే ఓ ఆరు రైళ్లకు మరో స్టేషన్ లో ప్రత్యేకంగా ఒక్క నిమిషం పాటు హాల్ట్ ఇస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. నగరంలో జరిగే గుణదల మేరీ మాత ఉత్సవాలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే క్రైస్తవ సోదరుల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 9 నుంచి 11 వరకూ మూడు రోజుల పాటు ఆరు రైళ్లు ఇలా ఆ స్టేషన్లోనూ ఒక్క నిమిషం పాటు ఆగబోతున్నాయి.

ఈ నెల 9 నుంచి 11 వరకూ విజయవాడ గుణదలలోని మేరీ మాత ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే విజయవాడతో పాటు నగరంలోని రామవరప్పాడు రైల్వే స్టేషన్ లోనూ ఆరు రైళ్లకు హాల్ట్ ఇచ్చింది. ఇందులో విజయవాడ-నరసాపూర్, విజయవాడ-మచిలీపట్నం మధ్య రాకపోకలు సాగించే రెండు రైళ్లతో పాటు దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే మరో నాలుగు రైళ్లు ఉన్నాయి.

one minute halt to these 6 trains at Vijayawada s ramavarappadu station for mary matha festival

దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన వివరాల ప్రకారం ఈ నెల 9, 10 తేదీల్లో పూరీ-తిరుపతి మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైలు మధ్యాహ్నం 1.15కు రామవరప్పాడు స్టేషన్ లో ఆగనుంది. అలాగే తిరుపతి-పూరీ మధ్య రాకపోకలు సాగించే మరో రైలు ఈ నెల 10, 11 తేదీల్లో సాయంత్రం 6.25కు ఈ స్టేషన్ లో ఆగనుంది. బిలాస్ పూర్-తిరుపతి మధ్య నడిచే మరో రైలు ఈ నెల 8న మధ్యాహ్నం 1.16కు రామవరప్పాడులో ఆగనుంది. అలాగే తిరుపతి-బిలాస్ పూర్ రైలు ఈనెల 9న సాయంత్రం 6.25కు ఇక్కడ ఆగుతుంది. వీటితో పాటు విజయవాడ-నరసాపూర్ పాసింజర్ రైలు 9, 10, 11 తేదీల్లో రాత్రి 8.38కి రామవరప్పాడులో ఆగనుంది. అలాగే మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చే మరో రైలు ఉదయం 5.34కి రామవరప్పాడులో ఆగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+