వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ పార్టీ నేత రెహ్మాన్‌కు ఏడాది జైలు శిక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

Rehman
హైదరాబాద్: చెల్లని చెక్కు కేసులో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు రెహ్మాన్‌కు కోర్టు ఏడాది పాటు సాధారణ జైలు శిక్షను, 8 వేల రూపాయల జరిమానాను విధించింది. దాంతో పాటు ఫిర్యాదుదారుడికి 44 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సైబరాబాద్ 13వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది.

ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది దండెం రాంరెడ్డి కేసు పూర్వపరాలను వివరించారు. వైయస్సార్ కాంగ్రెసు నేత, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్‌కు చెందిన హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో గల ఖాళీ స్థలాన్ని రామంతపూర్ నివాసి శ్రీనివాస్ గౌడ్ కొనాలని అనుకున్నారు.

శ్రీనివాస్ తన భార్య పేరు మీద కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుని పలు విడతలుగా రూ. 44 లక్షలు రెహ్మాన్‌కు చెల్లించారు. అయితే, కొన్నాళ్లకు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. తీసుకున్న సొమ్మును తిరిగి చెల్లించడానికి రెహ్మాన్ రెండు చెక్కులను శ్రీనివాస్ గౌడ్‌కు ఇచ్చారు. కానీ ఆ చెక్కులు చెల్లలేదు.

లీగల్ నోటీసులు పంపించినా రెహ్మాన్ స్పందించకపోవడంతో శ్రీనివాస్ గౌడ్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు శుక్రవారంనాడు వెలువడింది.

English summary
Court has ordered for one year imprisonment to YSR Congress party leader Rehman in a cheque vounce case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X