Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పారడైజ్‌లో నిమ్మగడ్డ పేరు: జగన్ కంపెనీలకు నిధులు ఇలా, నివ్వెరపోయే నిజాలు

Recommended Video

    Paradise Papers Leak : పారడైజ్‌లో నిమ్మగడ్డ పేరు:నివ్వెరపోయే నిజాలు

    హైదరాబాద్/అమరావతి: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసులో సీబీఐ దాఖలు చేసిన 11 ఛార్జీషీట్లలో నాలుగో దానిలో ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ పేరు ఉంది. ఇప్పుడు ఆయన పేరు పారడైజ్ పత్రాల్లో వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది.

    ప్రసాద్‌ నిర్వహించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పేపర్స్ అప్లెబీ రికార్డుల్లో ఉన్నాయని ఐసీఐజేలో సభ్యత్వం ఉన్న ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. 2016లో ఐసీఐజే ప్రచురించిన బహమాస్‌ లీక్స్ పత్రాల్లోనూ నిమ్మగడ్డ పేరుంది.

     వారితో నిమ్మగడ్డకు సంబంధాలు

    వారితో నిమ్మగడ్డకు సంబంధాలు

    రస్‌ అల్‌ ఖైమా పెట్టుబడులు సంస్థ (రాకియా), ఓడరేవు-నిజాంపట్నం రేవు పారిశ్రామిక కారిడార్ (వాన్‌పిక్‌), లెబనాన్‌-స్విస్‌ జాతీయుడైన రాకియా సీఈవో ఖతేర్‌ మస్సాద్‌‌లతో నిమ్మగడ్డకు ఉన్న సంబంధాలను ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి.

     నిమ్మగడ్డ - జగన్.. నీకిది నాకది

    నిమ్మగడ్డ - జగన్.. నీకిది నాకది

    ఆర్థిక శాఖ అభ్యంతరాలను పక్కన పెట్టి 22 వేల ఎకరాల భూముల్ని ప్రసాద్‌కు కట్టబెట్టినట్లు 2012లోనే సీబీఐ 177 పేజీల ఛార్జీషీటులో పేర్కొంది. భూమిపరంగా పొందిన లబ్ధికి ప్రతిఫలంగా క్విడ్‌ ప్రో కో ప్రాతిపదికన జగన్‌ కంపెనీల్లో రూ.854 కోట్ల పెట్టుబడుల్ని నిమ్మగడ్డ పెట్టినట్లు తెలిపింది.

     ఇవన్నీ తాజా పత్రాల్లో

    ఇవన్నీ తాజా పత్రాల్లో

    దీనిలో రూ.140 కోట్లను మారిషస్‌ కంపెనీల ద్వారా తరలించినట్లు సీబీఐ 2013లో కోర్టుకు తెలిపింది. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం వాన్‌పిక్‌ భూముల కేటాయింపును రద్దు చేసింది. ఎప్పుడెప్పుడు ఎంతెంత మొత్తాలు ఏయే కంపెనీలకు వచ్చిందీ పారడైజ్ పత్రాల్లో ఉంది.

    నిమ్మగడ్డ కంపెనీల భాగస్వామ్యంతో ఒప్పందం

    నిమ్మగడ్డ కంపెనీల భాగస్వామ్యంతో ఒప్పందం

    పారడైజ్ పత్రాల్లో వివరాల ప్రకారం.. యూఏఈకి చెందిన రస్ ఆల్ ఖైమా(రాకియా) ఏపీలో వాడరేవు, నిజాంపట్నం పోర్టులను అభివృద్ధి చేసేందుకు అంగీకరించింది. వైయస్ హయాంలో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు నిమ్మగడ్డ కంపెనీల భాగస్వామ్యంతో చేపట్టేలా రాకియా ఒప్పందం కుదుర్చకుంది. ఇందుకోసం రాకియా మారిషస్‌లో 2008లో రాక్ విజన్ లిమిటెడ్, రాక్ ఇన్ ఫ్రా హోల్డింగ్స్ లిమిటెడ్ కంపెనీలను స్థాపించింది. వీటికి రూ.714 కోట్లకు పైగా బదలాయించిందని ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి.

     ఆ రెండు సంస్థల ద్వారా పెట్టుబడులు

    ఆ రెండు సంస్థల ద్వారా పెట్టుబడులు

    ఆ రెండు సంస్థల ద్వారా నిమ్మగడ్డ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత రాక్ ఇన్ ఫ్రాకు చెందిన 462 కోట్లకు పైమొత్తం షేర్లను వాన్ పిక్ పోర్ట్స్‌కు బదలాయించారు. ఆ తర్వాత నిమ్మగడ్డకు చెందిన మూడు కంపెనీలకు షేర్లు బదలీ అయ్యాయి.

     నిమ్మగడ్డ అరెస్టయ్యాక

    నిమ్మగడ్డ అరెస్టయ్యాక

    ప్రసాద్‌ అరెస్టయిన కొన్ని నెలల తర్వాత 2013 ఆగస్టులో మారిషస్‌ ఆర్థిక సేవల కమిషన్‌ నుంచి అప్లెబీ సంస్థకు ఓ లేఖ వచ్చింది. మారిషస్‌ కంపెనీల నుంచి భారత్‌కు డబ్బు ప్రవహించిన తీరు అందులో ఉంది. ప్రవాస భారతీయునిగా 2007-08 మధ్య మారిషస్‌లో తాను వేర్వేరు కంపెనీలను నెలకొల్పాననీ, అవి ఇప్పటికీ ఉన్నాయని నిమ్మగడ్డ వివరణ ఇచ్చారు. 2008లో ఆర్థిక మాంద్యం వల్ల వాన్‌పిక్‌ ప్రాజెక్టుకు పెట్టుబడిదారుల్ని తీసుకురాలేకపోయానని చెప్పారు. ఎఫ్‌ఎస్‌సీ అడిగిన సందేహాలకూ తాము సమాధానాలిచ్చామన్నారు. సీబీఐ కేసు కోర్టులో ఉన్నందున దానిపై వ్యాఖ్య చేయబోనని చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+