parvatipuram assembly politics: పార్వతీపురంపై పెత్తనం వారిదేనా!!
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికలలో ఏపీలోని పార్వతీపురం నియోజకవర్గంలో అధికారంలోకి రావాలని టిడిపి, జనసేన, బిజెపిల ఉమ్మడి అభ్యర్థిగా బోనెల విజయ్ చంద్ర కు అవకాశం కల్పించగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మళ్ళీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
ఇక పార్వతీపురం నియోజకవర్గం విషయానికి వస్తే పార్వతిపురం నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఆ తర్వాత 2007- 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తరువాత పార్వతీపురం నియోజకవర్గ స్వరూపంలో మార్పు వచ్చింది. ప్రధానంగా అక్కడ వ్యవసాయం పైనే ప్రజల జీవితం కొనసాగుతుంది. ఈ నియోజకవర్గ ఓటర్ల విషయానికి వస్తే ఒక లక్ష 93 వేల, 314 మంది ఓటర్లు నియోజకవర్గంలో ఉన్నారు.

వారిలో పురుష ఓటర్లు 94 వేల 236 మంది కాగా, మహిళా ఓటర్లు 99, 039 మంది. ఎస్సీ నియోజకవర్గం అయిన పార్వతీపురం నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలలో పట్టు కోసం అన్ని రాజకీయ పార్టీలు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతున్న అలజంగి జోగారావు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2014లో పార్వతీపురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్థానంలో నిలిచారు. ఇక ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి వివిధ హోదాలలో పనిచేశారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికలలో పార్వతీపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేశారు. టిడిపి అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులుపై 24 వేల మెజార్టీతో గెలుపొంది తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ప్రస్తుతం అదే నియోజకవర్గం నుండి మళ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. జగన్ సర్కార్ తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆయన బలంగా నమ్ముతూ, ఇంటింటికి తిరిగి ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఈసారి ఎలాగైనా గెలవాలని దృఢ సంకల్పంతో ఉన్న టిడిపి బిజెపి జెఎస్పీ కూటమి నుండి బరిలోకి దిగుతున్న బోనాల విజయ్ చంద్ర ఇంటింటికి తిరుగుతూ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని వివరిస్తున్నారు.
ప్రతీ చోట విజయమే లక్ష్యంగా పెట్టుకున్న టిడిపి సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారాన్ని కొనసాగిస్తుంది . ఇక పార్వతీపురంలో హోరాహోరీగా అప్పుడే ప్రచారం కొనసాగిస్తున్న ఈ నేతలలో ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది తెలియాల్సి ఉంది.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications