మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్ధి ప్రకటన..!
ఏపీలో ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న జనసేన పార్టీ తాము పోటీ చేస్తున్న రెండో ఎంపీ సీటులోనూ అభ్యర్ధిని ప్రకటించింది. ఇప్పటికే కాకినాడ పార్లమెంటు స్ధానంలో టీటైం అధినేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను ఎంపిక చేసిన జనసేన.. ఇప్పుడు మచిలీపట్నం స్ధానంలోనూ అభ్యర్ధిని ప్రకటించింది. ఈ సీటు కోసం దాదాపు ముగ్గురి పేర్లను పరిశీలించిన జనసేన పార్టీ.. చివరికి వైసీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చిన సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి పేరునే ఖరారు చేసింది.
మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరఫున వల్లభనేని బాలశౌరిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 శాసన సభ స్థానాలు, 2 లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తోంది. ఇందులో అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు మాత్రమే ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అక్కడ సర్వే జరుగుతోందని, ఇందుకు సంబంధించి సంతృప్తికర ఫలితాలు వచ్చిన అనంతరం అభ్యర్థిని ప్రకటిస్తారని జనసేన తెలిపింది.

బందరు లోక్ సభ సీటులో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన వల్లభనేని బాలశౌరికి సీఎం జగన్ కు సన్నిహితుడిగా పేరుంది. అయితే మరోసారి బాలశౌరిని బందరు నుంచి పోటీకి దింపేందుకు జగన్ ఇష్టపడకపోవడంతో ఆయన వైసీపీకి దూరమయ్యారు. ఈ క్రమంలో జనసేన పార్టీలో చేరిన ఆయన్ను పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. బందరు సీటు హామీతోనే ఆయన జనసేనలో చేరినట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ సీటును పవన్ ఇప్పటివరకూ ఖరారు చేయకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇవాళ ప్రకటన వచ్చింది.
-
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications