నాగబాబుకు మంత్రి పదవి ఖరారు వేళ అనూహ్య పరిణామం..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూ 3.22 లక్షల కోట్ల అంచనాలతో 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు గ్రాడ్యుయేట్ సీట్లు కూటమికి దక్కగా.. మరో ఉపాధ్యాయ సీటు మాత్రం కోల్పోయింది. ఇటు బడ్జెట్ లో ప్రతిపాదించిన పథకాల అమలు పైన ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇక, ఎమ్మెల్యే కోటా లో అయిదు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ పైన చంద్రబాబు - పవన్ చర్చించారు. నాగబాబుకు ఎమ్మె ల్సీ - మంత్రి పదవి పైన కీలక నిర్ణయం తీసుకున్నారు.
చంద్రబాబు - పవన్ చర్చలు
ఏపీలో ఎమ్మెల్యే కోటాలో అయిదు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ పైన చంద్రబాబు - పవన్ చర్చించారు. ఈ అయిదు స్థానాల్లో ఒకటి జనసేన.. మరొకటి బీజేపీకి కేటాయింపు పైన చర్చ జరిగింది. జనసేన నుంచి నాగబాబు కు సీటు ఖాయమైంది. బీజేపీకి త్వరలో సాయిరెడ్డి స్థానంలో రాజ్యసభ సీటు దక్కనుండటంతో.. ఎమ్మెల్సీ సీటు ఈ సారికి మినహాయింపు ఇచ్చేలా ఈ ఇద్దరి మధ్య ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ నాయకత్వం పట్టు బడితే సీటు కేటాయించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలోని తీసుకుంటామని రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు సమయంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపై కొద్దిసేపు చర్చించారు.

ఎమ్మెల్సీగా మెగా బ్రదర్
ఇప్పుడు ఇదే అంశం పైన చంద్రబాబు - పవన్ మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయిదు స్థానాలు కూటమికే దక్కనుండటంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే, నాగబాబుకు మంత్రి పదవి పైన ఇప్పటికే పవన్ స్పష్టత ఇచ్చారు. ఇక్కడ కులం, బంధుప్రీతి కాదని, పనిమంతుడా కాదా అనేది మాత్రమే చూస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎంపీగా ప్రకటించి, మళ్లీ నాగబాబును తప్పిం చామని గుర్తు చేశారు. ఎవరికి ప్రతిభ ఉందో చూసి పదవులు ఇస్తామని చెప్పిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పవన్ చెప్పిన విధంగా నాగబాబుకు ముందుగా ఎమ్మెల్సీగా చేసేందుకు చంద్రబాబుతో భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఉగాది వేళ నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకునే అంశం పైన చర్చించినట్లు తెలుస్తోంది.
కేబినెట్ లోకి నాగబాబు
అయితే, మంత్రివర్గంలో కొన్ని మార్పులు - చేర్పులు అవసరమే చర్చ జరిగినా.. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కూడా అవ్వగుండా మంత్రివర్గంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. ప్రతికూల సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో, ఇప్పుడు నాగబాబుకు మంత్రిపదవి ఖాయంగా కనిపిస్తోంది. ఇక, ఈ ఇద్దరి సమావేశంలో మే నెల నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపైనా వారి మధ్య చర్చ జరిగిం ది. నాగబాబుకు శాఖ కేటాయింపు పైన సూచించాని పవన్ ను చంద్రబాబు కోరినట్లు సమాచారం. పవన్ మాత్రం చంద్రబాబుకే నిర్ణయాధికారం అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో, నాగబాబుకు కేటాయించే శాఖల పైన జనసేనలో ఆసక్తి కనిపిస్తోంది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications