జగన్ బాటలో పవన్.. ఆందోళనలో ఫ్యాన్స్
ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నేతల జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తంగా భద్రపరచడం జరిగింది. గెలుపుపై ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో కంటే పోలింగ్ శాతం పెరిగింది. 2019 ఎన్నికల్లో 79.74 % పోలింగ్ జరగ్గా..ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం 81 శాతం జరిగినట్టు అధికారులు ప్రకటించారు. ఓటింగ్ శాతం పెరగడంతో ఆ ప్రభావం ఏ పార్టీ మీద పడుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే ఎన్నికలు ముగయడంతో ఏపీ సీఎం జగన్ విదేశాలకు పయనం అయ్యారు. సీఎం జగన్ విదేశీ పర్యటన కోసం విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతు సడలించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే.దీంతో సీబీఐ గతంలోనే విదేశీ పర్యటనలకు వెళ్ళటం జరిగిందని విచారణ జరుగుతుందని.అనుమతి ఇవ్వొద్దని వాదనలు వినిపించింది.దీంతో వాదనలు మొత్తం విన్న న్యాయమూర్తి ఇటీవల తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది.తాజాగా మే 14వ తారీకు జగన్ విదేశీ పర్యటనకు కోర్ట్ అనుమతి ఇవ్వటం జరిగింది.దీంతో మే 17 నుంచి జూన్ మొదటి తారీకు వరకు కుటుంబంతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్కు వెళ్ళనున్నారు.

తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం విదేశి పర్యటనకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ నెలలో పవన్ విదేశాలకు వెకేషన్కు వెళ్లబోతున్నట్లు సమాచారం. ఆయన ఎక్కడికి వెళ్తాడనే దానిపై క్లారిటీ లేదు. అలాగే కుటంబసమేతంగా వేళ్తారా సింగిల్గా వెళ్తారా అనే విషయం కూడా తెలియరాలేదు. కానీ దాదాపు నెల రోజుల పాటు పవన్ విదేశాల్లో గడిపి జూన్ మధ్యలో తిరిగి వస్తారనేది టాక్ వినిపిస్తోంది. పవన్ వచ్చిన తర్వాత జూన్ చివరి వారంలో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం. పవన్ విదేశాలకు వెళ్తే సినిమా షూటింగ్లు ఆలస్యం అవుతున్నాయని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
-
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications