రాజధానిలో పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ ఇలా:ఉండవల్లి గుహల సందర్శన
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం నవ్యాంధ్ర రాజధానిలో పర్యటిస్తున్నారు. ఉదయం ఉండవల్లి గుహల సందర్శనతో పవన్ రాజధాని పర్యటన ప్రారంభం కానుంది.
అనంతరం మధ్యాహ్నం 12గంటలకు ఇటీవల జనసేనలో పార్టీలో చేరిన విశాఖపట్టణానికి చెందిన పార్టీ శ్రేణులతో పవన్ భేటీ అవుతారు. అలాగే 2.30లకు పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు ఆక్వా పార్క్ రైతులతో పవన్ సమావేశం కానున్నారు. భోజన విరామం అనంతరం 3.30 కి పార్టీ కోర్ కమిటీ నాయకులతో పవన్ కల్యాణ్ సమావేశం అవుతారు.

అనంతరం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీలో చేరిక కార్యక్రమాలు ఉంటాయని తెలుస్తోంది. రాత్రి 7.30కి పార్టీ రాష్ట్రస్థాయి నేతలతో పవన్ భేటీ అవడంతో ఆదివారం షెడ్యూల్ ముగియనుంది.












Click it and Unblock the Notifications