ప్రజల దృష్టి మళ్లించేందుకే విశాఖ రాజధాని ప్రకటన అన్న పయ్యావుల కేశవ్
విశాఖపట్నానికి షిఫ్ట్ అవుతున్నానంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన వెనక అనేక కారణాలున్నాయని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ వేగం పెంచిందని, దీన్ని డైవర్ట్ చేయడానికి ఉన్నపళంగా విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించారని ఆరోపించారు. వివేకా హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి సెల్ ఫోన్ లో ఎవరెవరితో మాట్లాడారు అనే అంశమే ఇప్పుడు కీలకంగా మారబోతోందన్నారు. ఆ కాల్ డేటా వివరాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు విశాఖ రాజధానిపై ప్రకటన చేశారని పయ్యావుల అభిప్రాయపడ్డారు. ఏపీ రాజధాని అమరావతి అంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని, దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా, అది పెండింగ్ లో ఉందన్నారు. ముఖ్యమంత్రి చేసిన ప్రకటన కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో విశాఖ రాజధాని కాబోతోందని, తాను కూడా అక్కడకు షిఫ్ట్ అవుతున్నానని ఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రకటించారు. అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు అందరినీ ఆహ్వానిస్తున్నానన్నారు. కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా ఉంటాయన్నారు.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. గుంటూరు-విజయవాడ మధ్య ఉన్న ప్రాంతం కావడంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారికి సమదూరంలో ఉంటుందని దీన్ని నిర్ణయించారు. 2019లో ఎన్నికలు జరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల తర్వాత మూడు రాజధానులంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. అప్పటి నుంచి ఈ అంశంపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీల మధ్య పోరు నడుస్తోంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications