ఇక్కడా దూసుకెళ్తామంటున్న 'బ్లాక్' బ్యూటీస్ (పిక్చర్స్)
హైదరాబాద్: ఎఫ్బిబి ఫెమినా మిస్ ఇండియా ఆడిషన్స్లో ముద్దుగుమ్మలు మెరిసిపోయారు. సోమవారం రాజ్భవన్ రోడ్డులోని పార్క్ హోటల్లో ఎఫ్బిబి ఫెమీనా మిస్ ఇండియా ఆడిషన్స్ జరిగాయి.
పోటీలో పాల్గొన్న వారిలో ఆరుగురు బెంగుళూరులో జరగబోయే సౌత్ ఇండియా మిస్ ఫెమీనా కాంటెస్ట్కు ఎంపికయ్యారు. తద్వారా వారు చదువులోనే కాకుండా మోడలింగ్లోను దూసుకెళ్తామంటున్నారు.
నాలుగు సీక్వెన్స్లుగా జరిగిన ఆడిషన్స్లో వందలాది మంది మోడల్స్ పాల్గొన్నారు. వీరిలో నగరానికి చెందిన అపర్ణ, సింధూర, ఇర్షికా మెహరోత్రా, ప్రాచి చౌహాన్, మోనికా తంగపల్లి, జయా విశ్వనాథ్లు విజేతలుగా ఎంపికయ్యారు.
ఫెమినా 1
పోటీల్లో నెగ్గిన మోడల్స్ విద్యారంగంలో కూడా విశేషంగా రాణిస్తున్నారు. అపర్ణ అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రస్తుతం నగరంలో పిజి చేస్తున్నారు. మొదటిసారి పాల్గొన్న ఆడిషన్స్లో ఎంపికవ్వడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు.
ఫెమినా 2
ఇర్షికా మెహరోత్రా ఫైనాన్షియల్ ఎకానామక్స్లో డిగ్రీ పూర్తి చేశారు. ప్రాచి చౌహాన్ ఎంటెక్ మెదటి సంవత్సరం చదువుతున్నారు. జయా విశ్వనాథ్ మహత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ చదువుతున్నారు. గతంలో కూడా అడిషన్స్కు ఎంపికైనప్పటికీ ఫైనల్కు చేరుకోలేకపోయిన్నట్టు తెలిపారు.
ఫెమినా 3
మోనికా ముఫకంజా కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. 2010లో జరిగిన డాబర్ గులాబరీలో ఐదవ స్థానం సంపాదించిన్నట్టు ఆమె చెప్పారు.
ఫెమీనా 4
సింధూర విశాఖపట్నంలో ఎంబిబిఎస్ చేస్తున్నారు. మిస్ వైజాగ్ టైటిల్ను కైవసం చేసుకున్న ఆమె ఫెమీనా బ్రాండ్ అంబాసిడర్గా తానే విజయం సాదిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఫెమినా 5
ఎఫ్బిబి ఫెమినా మిస్ ఇండియా ఆడిషన్స్లో ముద్దుగుమ్మలు మెరిసిపోయారు. సోమవారం రాజ్భవన్ రోడ్డులోని పార్క్ హోటల్లో ఎఫ్బిబి ఫెమీనా మిస్ ఇండియా ఆడిషన్స్ జరిగాయి.
ఫెమినా 6
పోటీలో పాల్గొన్న వారిలో ఆరుగురు బెంగుళూరులో జరగబోయే సౌత్ ఇండియా మిస్ ఫెమీనా కాంటెస్ట్కు ఎంపికయ్యారు.
ఫెమినా 7
నాలుగు సీక్వెన్స్లుగా జరిగిన ఆడిషన్స్లో వందలాది మంది మోడల్స్ పాల్గొన్నారు. వీరిలో నగరానికి చెందిన అపర్ణ, సింధూర, ఇర్షికా మెహరోత్రా, ప్రాచి చౌహాన్, మోనికా తంగపల్లి, జయా విశ్వనాథ్లు విజేతలుగా ఎంపికయ్యారు.