52 అనుకుంటే 157, హైదరాబాద్..: కేటీఆర్ (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రపంచస్థాయి ఆకర్షణీయమైన అతిథ్య కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం చెప్పారు.
అంతర్జాతీయ ఈవెంట్స్ నిర్వహణకు అనువైన కేంద్రంగా నగరం గుర్తింపు పొందేలా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని చెప్పారు.
బుధవారం తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏడాది పాటు వారానికో ఈవెంట్ చొప్పున 52 ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించాలనుకుంటే.. 157 ఈవెట్లు నిర్వహించడానికి ముందుకు వచ్చారన్నారు.
కేటీఆర్
ప్రపంచస్థాయి ఆకర్షణీయమైన అతిథ్య కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం చెప్పారు.
కేటీఆర్
అంతర్జాతీయ ఈవెంట్స్ నిర్వహణకు అనువైన కేంద్రంగా నగరం గుర్తింపు పొందేలా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని చెప్పారు.
కేటీఆర్
బుధవారం తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏడాది పాటు వారానికో ఈవెంట్ చొప్పున 52 ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించాలనుకుంటే.. 157 ఈవెట్లు నిర్వహించడానికి ముందుకు వచ్చారన్నారు.
కేటీఆర్
నగర పరిధిలోని ఖానామెట్లో రూ.100 కోట్లతో ఏర్పాటు చేయనున్న హైదరాబాద్ - బ్యాబిటెట్ సెంటరుతో ఒకేచోట అనేక సౌకర్యాలు సమకూరుతాయన్నారు.
కేటీఆర్
ఈవెంట్స్ నిర్వహణకు సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తెస్తామని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వ సహకారాన్ని అందిస్తామని ఆయన తెలిపారు.
కేటీఆర్
తెలంగాణలో రూ.300 కోట్లతో ఈవెంట్ పరిశ్రమతో వేలమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని టీసీఈఐ (తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ) అధ్యక్షులు సూరజ్ సింగ్ మల్హోత్రా తెలిపారు.
కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో నాలుగేళ్లలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకోసం రాష్ట్రంలో వాటర్ గ్రిడ్ను ఏర్పాటు చేస్తుందని కేటీఆర్ అన్నారు.
కేటీఆర్
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తోడు కార్పొరేట్ సంస్థలు 2 శాతం నిధులను ఇలాంటి కార్యక్రమాలకు ఖర్చు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని తారకరామారావు అన్నారు.
కేటీఆర్
రంగారెడ్డి జిల్లా పరిధిలోని 16 గ్రామాల్లో స్వచ్ఛమైన నీటిని అందించాలని సంస్థ తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమని కేటీఆర్ తెలిపారు.
కేటీఆర్
దేశంలో నిర్వహించిన సర్వేలో మంచినీరు, పారిశుధ్యం వంటివి 40 శాతం వరకే అందుతున్నాయని, మిగతా 60 శాతం పూర్తి కావాలంటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తోడు కార్పొరేట్ సంస్థలు ఆర్థిక సహాయాన్ని అందించాలన్నారు.
కేటీఆర్
ఇప్పటికే కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్-శ్రేష్ట్ భారత్కు కార్పొరేట్ల నుంచి మంచి స్పందన వస్తోందని కేటీఆర్ అన్నారు.
కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఏర్పాటు చేసేందుకు 24 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయిస్తుందని కేటీఆర్ తెలిపారు.
కేటీఆర్
2015 ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని 2190 ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
కేటీఆర్
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మంచినీరు, విద్యుత్కోత సమస్యలున్నాయని, మున్ముందు వీటిని అధిగమిస్తామని మంత్రి పేర్కొన్నారు.
కేటీఆర్
ప్రపంచస్థాయి ఆకర్షణీయమైన అతిథ్య కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం చెప్పారు.