చిరు, పవన్ జోరు: ఊడ్చేస్తామని ఎఎపి (పిక్చర్స్)
హైదరాబాద్: సీమాంధ్రలో ఈ నెల 7వ తేదీన లోకసభకు, అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది.
ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. టిడిపి, బిజెపి తరఫున ప్రధానంగా చంద్రబాబు, పవన్, బాలకృష్ణ, తారకరత్న, నారా రోహిత్లు ప్రచారం చేస్తున్నారు.
కాంగ్రెసు పార్టీకి చిరంజీవి పెద్ద దిక్కు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున వైయస్ జగన్, షర్మిల, వైయస్ విజయమ్మలు ప్రచారంలో దూసుకు పెతున్నారు.

మారెప్ప
మాజీ మంత్రి మూలింటి మారెప్ప శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనకు కంభంపాటి హరిబాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

మందకృష్ణ మాదిగ
ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సీమాంధ్ర ప్రాంతంలో బిజెపి, టిడిపి కూటమికి ప్రచారం చేస్తున్నారు. ఆ కూటమిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

చిరంజీవి
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి శనివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ చిరు పైనే ఆశలు పెట్టుకుంది.

కాంగ్రెస్
సీమాంధ్ర ప్రాంతంలో ప్రచారం చేస్తున్న ఓ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి. ఈ ప్రచారంలో కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.

ఊడ్చేస్తాం
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోర్షన్ పరిధిలో ప్రచారం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) క్యాడర్. జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మ ఎదుట ఊడ్చుతూ...

హరి
జై సమైక్యాంధ్ర పార్టీ పార్లమెంటు అభ్యర్థి సబ్బం హరి ఓటర్లతో ముచ్చటిస్తున్న దృశ్యం. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జెఏస్పీ తరఫున పోటీ చేస్తున్నారు.

కెఏ పాల్
ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకులు కెఏ పాల్ సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమికి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శనివారం విష్ణు కుమార్ రాజుతో మాట్లాడుతున్న దృశ్యం. పవన్ బిజెపి, టిడిపి కూటమికి ప్రచారం చేస్తున్నారు.

చంద్రబాబు
తెలుగదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన శనివారం పలు జిల్లాల్లో ప్రచారం చేశారు.

చంద్రబాబు
తెలుగదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన శనివారం పలు జిల్లాల్లో ప్రచారం చేశారు.

చంద్రబాబు
తెలుగదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన శనివారం పలు జిల్లాల్లో ప్రచారం చేశారు. పక్కన మందకృష్ణ మాదిగ.

వైయస్సార్ కాంగ్రెస్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల ప్రచారం దృశ్యం. ఆ పార్టీ తరఫున వైయస్ జగన్, షర్మిల, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సీమాంధ్రను చుట్టేస్తున్నారు.












Click it and Unblock the Notifications