ఎన్టీఆర్.. హైదరాబాద్ టు ఢిల్లీ, బాబు ఎదుట! (పిక్చర్స్)
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కార్యాలయాల్లో టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఫోటోలు దర్శనమిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ పదేళ్లు అధికారానికి దూరంగా ఉంది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు తమ చాంబర్లలో ఎన్టీఆర్ ఫోటోలను పెట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాంబర్ ముందు భారీ ఎన్టీఆర్ చిత్రపటాన్ని బుధవారం రోజు ఉంచారు.
ఎన్టీఆర్
పదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎపి రాష్ట్ర కార్యాలయాలు స్వర్గీయ ఎన్టీఆర్ ఫోటోలతో కళకళలాడుతున్నాయి.
ఎన్టీఆర్
పదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎపి రాష్ట్ర కార్యాలయాలు స్వర్గీయ ఎన్టీఆర్ ఫోటోలతో కళకళలాడుతున్నాయి. సచివాలయంలో సిఎం చాంబర్ ముందు పెట్టిన భారీ ఎన్టీఆర్ చిత్రం.
ఎన్టీఆర్
సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాంబర్ ముందు ఉంచిన స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటో.
కంభంపాటి
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన అధికార ప్రతినిధిగా కంభంపాటి రామ్మోహన రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ అధికారులు, మంత్రులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతానని ఆయన తెలిపారు.
కంభంపాటి
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదాకు కృషి చేస్తానని కంభంపాటి చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
కంభంపాటి
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన అధికార ప్రతినిధిగా కంభంపాటి రామ్మోహన రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన కార్యాలయంలో ఎన్టీఆర్ ఫోటో.
ఎన్టీఆర్.. హైదరాబాద్ టు ఢిల్లీ, బాబు ఎదుట! (పిక్చర్స్)
కింజారపు అచ్చెన్నాయుడు హైదరాబాదులోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సమయంలో.. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న కుటుంబ సభ్యులు, నేతలు.