జగన్ పార్టీ ఎఫెక్ట్, సభ వాయిదా, బాబు ఇలా (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు.
అనంతరం ప్రశ్నోతరాలను కార్యక్రమం చేపట్టారు. అయితే వాయిదా తీర్మానం చేపట్టాలంటూ ప్రతిపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది.
సభ తొలుత పదిహేను నిమిషాలు వాయిదా పడింది. అనంతరం మరో పదిహేను నిమిషాలు వాయిదా పడింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో మూడోసారి సభను మంగళవారానికి వాయిదా వేశారు.
అసెంబ్లీ సమావేశానికి ముందు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బేఏసీ సమావేశం సోమవారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 6 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.
అసెంబ్లీ సమావేశానికి ముందు..
సమావేశాల గడువు పొడిగించాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించగా అందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాలు కొనసాగనున్నాయి.
అసెంబ్లీ సమావేశానికి ముందు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముందు బీఏసీ సమావేశం జరిగింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ.. తర్జన భర్జన అనంతరం బీఏసీ సమావేశానికి హాజరైంది. తొలుత బీఏసీ సమావేశానికి వెళ్లవద్దని భావించింది.
ఎన్టీఆర్ ఘాట్
అసెంబ్లీ సమావేశాలకు హాజరు అయ్యే ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారాయణ, పీతల సుజాత, పరిటాల సునీత, ఎమ్మెల్యేలు తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ ఘాట్
అసెంబ్లీ సమావేశాలకు హాజరు అయ్యే ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారాయణ, పీతల సుజాత, పరిటాల సునీత, ఎమ్మెల్యేలు తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
కోడెల
ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్ ఆదివారం మీడియా కమిటీ మెంబర్స్తో మాట్లాడారు. ఈ సమావేశంలో అసెంబ్లీ చీఫ్ విప్, ప్రభుత్వ విప్, అసెంబ్లీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.
కోడెల
ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్, అసెంబ్లీ చీఫ్ విప్, ప్రభుత్వ విప్, అసెంబ్లీ సెక్రటరీ తదితరులు ఆదివారం ఏపీ అసెంబ్లీ హాలును తనిఖీ చేస్తున్న దృశ్యం.
కోడెల
ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్, అసెంబ్లీ చీఫ్ విప్, ప్రభుత్వ విప్, అసెంబ్లీ సెక్రటరీ తదితరులు ఆదివారం ఏపీ అసెంబ్లీ హాలును తనిఖీ చేస్తున్న దృశ్యం.
కోడెల
ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్, అసెంబ్లీ చీఫ్ విప్, ప్రభుత్వ విప్, అసెంబ్లీ సెక్రటరీ తదితరులు ఆదివారం ఏపీ అసెంబ్లీ హాలును తనిఖీ చేస్తున్న దృశ్యం.
కోడెల
ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్, అసెంబ్లీ చీఫ్ విప్, ప్రభుత్వ విప్, అసెంబ్లీ సెక్రటరీ తదితరులు ఆదివారం ఏపీ అసెంబ్లీ హాలును తనిఖీ చేస్తున్న దృశ్యం.