సరయూలో ఇద్దరి గల్లంతు, ఫ్యామిలీ ఆందోళన(పిక్చర్స్)
హైదరాబాద్: బియాస్, డిండి విషాదం మరవకముందే మరో ప్రమాదం. నగరానికి చెందిన ఇద్దరు వేద విద్యార్థులు ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య వద్ద సరయూ నదిలో గల్లంతయ్యారు. మల్కాజిగిరిలోని గౌతమ్ నగర్ డివిజన్ వాణీనగర్కు చెందిన కృష్ణకిషోర్ కుమారుడు చక్రపాణి(20), డబీర్పురాకు చెందిన కిరణ్(20)తోపాటు మరో 48 మంది వేద విద్యార్థులు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరిగే రామాయణ సుందరకాండ యజ్ఞానికి బయలుదేరి వెళ్లారు.
అల్వాల్కు చెందిన విశ్వనాథ శాస్త్రి అనే వేదపండితుడి ఆధ్వర్యంలో ఈ విద్యార్థులంతా జూన్ 30వ తేదీన వరంగల్ నుంచి రైలులో ఉత్తరప్రదేశ్ వెళ్లారు. మంగళవారం సాయంత్రం వారంతా అయోధ్య చేరుకున్నారు. స్నానం చేయడానికి విద్యార్థులంతా సరయు నదిలోకి దిగారు. వీరిలో చక్రపాణి, కిరణ్ గల్లంతయ్యారు.
గల్లంతైన మరో విద్యార్థి రవికిరణ్ స్వగ్రామం కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట. అతడి తల్లిదండ్రులు పెద్దింటి విజయప్రసాద్, సత్యవతి. 25 ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన వారు డబీర్పురాలోని కోమటివాడలో ఉంటున్నారు. గాంధీ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివిన రవికిరణ్ వేద విద్యను అభ్యసించడానికి రాజేంద్రనగర్ సర్కిల్ బుద్వేల్ స్మార్థ పాఠశాలలో 2003లో చేరాడు. 2008లో వేద విద్యను పూర్తి చేశాడు. అనంతరం పురోహితుడిగా కొనసాగుతున్నాడు.
సీఐ
బియాస్ నది మాదిరిగానే ఒక్కసారిగా సరయు నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో వారిద్దరూ కొట్టుకుపోయారని మిగిలిన వారు చెబుతున్నారు. హైదరాబాదులో సీఐ వివరాలు సేకరిస్తున్న దృశ్యం.
పోలీసులు
టీవీల్లో సంఘటనకు సంబంధించిన వార్తలు ప్రసారమవ్వడంతో తల్లిదండ్రులు చక్రపాణి సెల్కు ఫోన్ చేశారు. అతడి స్నేహితుడు సుబ్రహ్మణ్యం వద్ద ఈ ఫోన్ ఉంది. అతడు లిఫ్ట్ చేసిన గల్లంతైన మాట వాస్తవమేనని నిర్ధారించాడు. దీంతో చక్రపాణి తల్లిదండ్రులు కృష్ణకిషోర్, రాజేశ్వరి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
చక్రపాణి
యాస్, డిండి విషాదం మరవకముందే మరో ప్రమాదం. నగరానికి చెందిన ఇద్దరు వేద విద్యార్థులు ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య వద్ద సరయు నదిలో గల్లంతయ్యారు. గల్లంతైన చక్రపాణి.
చక్రపాణి తండ్రి
చక్రపాణి ఎన్ఐఐటీ నవోదయలో ఐటీ విభాగంలో చదువుతున్నాడు. చక్రపాణి గల్లంతైన విషయం తెలియడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చక్రపాణి తండ్రి ఎదురుచూపు!
చక్రపాణి కుటుంబం
సరయు నదిలో చక్రపాణి గల్లంతైన విషయం తెలియడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాపాడాలను వారు కోరుతున్నారు.
చక్రపాణి కుటుంబం
సరయు నదిలో చక్రపాణి గల్లంతైన విషయం తెలియడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాపాడాలను వారు కోరుతున్నారు.
చక్రపాణి బంధువులు
సరయు నదిలో చక్రపాణి గల్లంతైన విషయం తెలియడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాపాడాలను వారు కోరుతున్నారు. చక్రపాణి ఇంటికి వచ్చిన బంధువులు.
చక్రపాణి ఇల్లు
ఉత్తర ప్రదేశ్లోని సరయు నదిలో గల్లంతైన చక్రపాణి శర్మ నివాసం.. మల్కాజిగిరిలోని గౌతమ్ నగర్ డివిజన్ వాణీనగర్లో ఈ ఇల్లు ఉంది.
చక్రపాణి ఇల్లు
ఉత్తర ప్రదేశ్లోని సరయు నదిలో గల్లంతైన చక్రపాణి శర్మ నివాసం.. మల్కాజిగిరిలోని గౌతమ్ నగర్ డివిజన్ వాణీనగర్లో ఈ ఇల్లు ఉంది.
కుటుంబం
సరయు నదిలో చక్రపాణి గల్లంతైన విషయం తెలియడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాపాడాలను వారు కోరుతున్నారు.
కుటుంబం
సరయు నదిలో చక్రపాణి గల్లంతైన విషయం తెలియడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాపాడాలను వారు కోరుతున్నారు.
చక్రపాణి కుటుంబం
ఉత్తర ప్రదేశ్లోని సరయు నదిలో చక్రపాణి గల్లంతైన విషయం తెలియడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాపాడాలను వారు కోరుతున్నారు.
మీడియా
ఉత్తర ప్రదేశ్లోని సరయు నదిలో చక్రపాణి గల్లంతైన విషయం తెలియడంతో ఆతని కుటుంబ సభ్యులో ఆందోళన చెందుతున్నారు. చక్రపాణి నివాసం వద్ద మీడియా.
టీవీ చూస్తూ
సరయు నదిలో చక్రపాణి గల్లంతైన విషయం తెలియడంతో టీవీ చూస్తున్న కుటుంబ సభ్యులు. మరోవైపు, గల్లంతైన మరో విద్యార్థి రవికిరణ్ స్వగ్రామం కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట. అతడి తల్లిదండ్రులు పెద్దింటి విజయప్రసాద్, సత్యవతి.