నంద్యాల టిడిపి అభ్యర్థిని హత్య చేయాలని చూస్తున్నారా?: పితాని సంచలనం
నంద్యాల బహిరంగ సభలో వైసిపి అధినేత వైయస్ జగన్ చేసిన కాల్చివేత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టిడిపి నేతలు వైసిపిపై భగ్గుమంటున్నారు. తాజాగా, పితాని సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: నంద్యాల బహిరంగ సభలో వైసిపి అధినేత వైయస్ జగన్ చేసిన కాల్చివేత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టిడిపి నేతలు వైసిపిపై భగ్గుమంటున్నారు. తాజాగా, పితాని సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టిడిపి అభ్యర్థిని హత్య చేయాలని చూస్తున్నారా?: పితాని
నంద్యాలలో టిడిపి అభ్యర్థిని హత్య చేయాలని చూస్తున్నారా అని వ్యాఖ్యానించారు. నంద్యాల టిడిపి అభ్యర్థిగా భూమా బ్రహ్మానంద రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. జగన్ దగ్గర ఇంకా రూ.10వేల కోట్ల అవినీతి సొమ్ము ఉందని ఆరోపించారు. నంద్యాల సభలో జగన్ రెచ్చగొట్టేలా మాట్లాడారని మండిపడ్డారు.
Recommended Video


వైయస్సార్ 30 ఏళ్లు నిరీక్షించారు
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పైకి ప్రజలను ఉసిగొల్పడం దారుణం అని పితాని అన్నారు. జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ముఖ్యమంత్రి కావడం కోసం వైయస్ రాజశేఖర రెడ్డి 30 ఏళ్లు నిరీక్షించారని గుర్తు చేశారు.

రోజా నేర్చుకోవాలి
వైసిపిలో గౌరవం లేదనే కొందరు నాయకులు టిడిపిలో చేరుతున్నారని పితాని చెప్పారు. సినిమాల్లోంచి రోజా ఇంకా బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. నిత్యం విమర్శలు చేయడం, అర్థం లేని మాటలు కాకుండా ప్రజా సమస్యలపై పోరాడటం రోజా నేర్చుకోవాలని హితవు పలికారు.

రాజకీయాలకు పనికి రారు
జగన్ లాంటి క్రిమినల్ మైండ్ ఉన్న నేతలు రాజకీయాలకు పనికి రారని ఎంపీ సిఎం రమేష్ మండిపడ్డారు. ఆయనను రాజకీయాల నుంచి తొలగించేలా ఈసీ దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. ఇలాంటి వారిని ప్రజలు ఏమాత్రం సహించరని చెప్పారు. సమాజానికి చీడపురుగులా తయారయ్యారన్నారు.

మేం తలదించుకునేలా
రాజకీయాలు అంటే ఇలా కూడా మాట్లాడుతారా అని ప్రజలు ఆశ్చర్యపోయేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. ఆయన మాటలు రాజకీయ నాయకులే అవమానంగా భావించేలా ఉన్నాయన్నారు.

పులివెందుల ప్రజలు తెలుసుకోవాలి
నిన్ననేమో చెప్పుతో కొట్టాలని అంటాడని, ఇప్పుడేమో కాల్చమని అంటున్నాడని సిఎం రమేష్ గుర్తు చేశారు. పులివెందుల ప్రజలు జగన్ మాటలను గుర్తుంచుకొని, ఆయనను ఎందుకు ఎన్నుకున్నామా అని బాధపడాల్సిన పరిస్థితి అని అభిప్రాయపడ్డారు. జగన్ గురించి వారు తెలుసుకోవాలన్నారు.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications