ఎన్నికల్లో గెలిచినట్లే, మమతా బెనర్జీతో మాట్లాడా: చంద్రబాబు,
రాష్ట్రపతి ఎన్నికలు నామమాత్రమేనని, ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ గెలుపు తథ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలు నామమాత్రమేనని, ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ గెలుపు తథ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు.
రామ్నాథ్ కోవింద్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నామినేషన్ పత్రాల్లోని రెండో సెట్లో సంతకం చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రపతి ఎన్నికలు ఏకగ్రీవం చేస్తే బాగుండేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఒక ఉన్నతమైన అభ్యర్థిని రాష్ట్రపతిగా ఎన్డీయే ఎంపిక చేసిందని, ఆయనకు అన్ని విధాలా టిడిపి సహకరిస్తుందని తెలిపారు.

అన్ని పార్టీలను కలిశామని చంద్రబాబు అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో తాను మాట్లాడానని చెప్పారు. రామ్నాథ్ కోవింద్ ఏకగ్రీవం అయి ఉంటే బాగుండేదని కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడు కూడా అన్నారని తెలిపారు.
ఉన్నతమైన సంప్రదాయాలు కలిగిన, ఒక చరిత్ర కలిగిన వ్యక్తిని ప్రధాని మోడీ ఎంపిక చేశారని, అలాంటి వ్యక్తికి అందరూ సహకరించాల్సి ఉందని, ఎన్నికలు నామమాత్రేనని, ఇప్పటికే రామ్నాథ్ గెలిచినట్లేనని, అయితే టెక్నికల్గా ఎన్నికలు జరగాలన్నారు. ఇలాంటి ఉన్నతమైన పదవి విషయంలో అందరి సహకరిస్తే దేశం ప్రతిష్ట, ఆ పదవి గౌరవం పెరుగుతుందన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications