3 వేల మంది మహిళలు రౌడీలా, ఉగ్రవాదులా..? జాతీయ మహిళా కమిషన్తో కేశినేని నాని
అమరావతి రాజధాని మార్పుపై విజయవాడలో ఆందోళన చేసిన మహిళలతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇవాళ గుంటూరులో జాతీయ మహిళా కమిషన్ సభ్యులు పర్యటించి వివరాలు తెలుసుకొన్నారు. అటు నుంచి విజయవాడ వచ్చి బాధిత మహిళలతో మాట్లాడారు. ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. జరిగిన ఘటనపై ఎంపీ కేశినేని నాని పోలీసుల తీరును తప్పుపట్టగా.. స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తనపై మిన్సింగ్ కేసు పెట్టడం సరికాదని విమర్శించారు.

3 వేల మంది మహిళలు..
రాజధాని మార్పును నిరసిస్తూ విజయవాడలో 3 వేల మంది మహిళలు ఆందోళన చేపట్టారు. అయితే వారిని పోలీసులు వివిధ పీఎస్లకు తిప్పుతూ రాత్రి 9 గంటల తర్వాత వదిలిపెట్టారని ఆరోపించారు. దీనిపై ఆదివారం జాతీయ మహిళా కమిషన్ విజయవాడలో మహిళలతో మాట్లాడింది. శుక్రవారం ఏం జరిగిందనే అంశంపై ఆరాతీసింది. మహిళా కమిషన్ సభ్యులతో స్థానిక ఎంపీ కేశినేని నాని కూడా ఉన్నారు.

రౌడీలా..? ఉగ్రవాదులా..?
మహిళలు చేసిన తప్పేంటని కేశినేని నాని ప్రశ్నించారు. వారు ఏదైనా సంస్థకు చెందినవారా..? రౌడీలా? గుండాలా? ఉగ్రవాదుల అని అడిగారు. తమ ప్రాంత అభివృద్ధి రాజధానితో జరుగుతుందని.. క్యాపిటల్ సిటీ మార్చొద్దని ఉద్యమిస్తున్నారని గుర్తుచేశారు. అలాంటి వారిని 4 గంటల పాటు.. వివిధ పోలీసు స్టేషన్లు తిప్పడం ఏంటీ అని అడిగారు.

తుంగలో తొక్కి
మహిళలను పోలీసుస్టేషన్ తీసుకెళ్లే సమయంలో కూడా నియమ, నిబంధనలను ఉల్లంగించారని కేశినేని నాని పేర్కొన్నారు. 6 గంటల తర్వాత వారిని వదిలేశారని ఇది జాతీయ మహిళ కమిషన్ దృష్టికి తీసుకొచ్చామని చెప్పారు. సీఆర్పీసీ 46 సెక్షన్ ప్రకారం మహిళలను 6 గంటల తర్వాత పీఎస్లో పెట్టడం నేరమని, అదే విషయాన్ని మహిళా కమిషన్ దృష్టికి తీసుకొచ్చామని తెలిపారు.

మిస్సింగ్ కేసు...
జాతీయ మహిళా కమిషన్కు మహిళల ఫిర్యాదుపై స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. తన అందుబాటులో లేనని, మిస్సింగ్ కేసు పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. టీడీపీ నేతలు ముందుండి రాజకీయ ఉద్యమం చేస్తున్నారని మండిపడ్డారు. దళిత మహిళ ఎమ్మెల్యే అని తన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

రాయి వేయండి..
సభల్లో కొన్ని వీడియోలు చూస్తే భయమేస్తుందని చెప్పారు. వెనక నుంచి కొందరు రాయి వేయండి, కొట్టండి అని అనడం చూస్తే కావాలనే రెచ్చగొడుతున్నారని అర్థమవుతోందన్నారు.
-
జగన్ సన్నిహిత అధికారితో రహస్య భేటీ, ప్రభుత్వం సీరియస్- ఐఏఎస్ పై వేటు..!! -
బడి పిల్లలు శోభనం పెళ్లి కొడుకులా? ఏంటిది - గరికపాటి వ్యాఖ్యల వివాదం..!! -
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications