హెల్మెట్ లేదు! బైక్పై ఐదుగురి ప్రయాణం: దండం పెట్టిన ఇన్స్పెక్టర్
Recommended Video
అనంతపురం: తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటున్నారు. ఏ సమస్య వచ్చిన క్షణాల్లో స్పందిస్తూ పరిష్కారం చూపిస్తున్నారు. నేరాలను తగ్గించడంలో మెరుగైన పాత్రను పోషిస్తున్నారు.
అంతేగాక, ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటున్నారు. కాగా, తాజాగా, ఇందుకు ఉదాహరణగా తెలుగు రాష్ట్రాల్లో రెండు ఘటనలో చోటు చేసుకున్నాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ మారాయి.
Two pics of TS & AP breaking the internet today
— Pinky Rajpurohit (@Madrassan) October 9, 2017
1) Hyderabad cop with kidnapped baby, whom he rescued in 15 hours.
2) Pic says it all 😂 pic.twitter.com/qGwCPtuARR
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ జిల్లాలోని మడకసిరలో ఒక బైకుపై ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా ప్రయాణించాడు. అంతేగాక, ఆ వ్యక్తితో పాటు ఆ బైక్పై ఏకంగా ఐదుగురు ఉన్నారు. అందులో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
ఇంత ప్రమాదకరంగా ఆ వ్యక్తి బైకుపై ప్రయాణిస్తోంటే ఏం చెప్పాలో తెలియక శుభకుమార్ అనే ఇన్స్పెక్టర్ వారికి చేతులు జోడించి దండం పెట్టేశాడు. ఇలా ప్రయాణిస్తే ఎలా? అంటూ ప్రశ్నించాడు. మీ క్షేమం కోసమే చెబుతున్నానని చెప్పారు. కాగా, ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ చేతులెత్తి ఆయన దండం పెడుతుండగా తీసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.