ప్రచారంలో దోశ వేసి: శోభకి మాజీడిజిపి నివాళి(పిక్చర్స్)
హైదరాబాద్: ఎన్నికల ప్రచారానికి తెరపడే సమయం దగ్గరపడుతుండటంతో వివిధ రాజకీయా పార్టీల నాయకులు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో తమ ప్రచారాన్ని విస్తృతం చేశారు. వాడవాడలా ఇంటింటికీ తిరుగుతూ తమను గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, ఎంఐఎం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీల నాయకులు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
నగరంలోని జూబ్లీహిల్స్లో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. నీళ్లు మోసి, ఇస్త్రీ చేసి మరీ ఓట్లు అడుగుతున్నారు. డప్పుల దరువేస్తూ వారి ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం-బిజెపిలు కూడా తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తరపున టిడిపి అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు బిజెపి అభ్యర్థులు బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్లు టిడిపి అభ్యర్థులు మల్లారెడ్డి, సాయన్నలు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎల్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో వీధి వీధి తిరుగుతూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మల్కాజ్గిరి ఎంపి అభ్యర్థి, కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ కూడా తన ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దినేష్ రెడ్డి కూడా తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఎంఐఎం పార్టీ నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలు కూడా తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. రోడ్షోలు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
డప్పు వాయించి..
నగరంలోని జూబ్లీహిల్స్లో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. డప్పుల దరువేస్తూ వారి ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు.
ఇంటింటికీ వెళ్లి..
నగరంలోని జూబ్లీహిల్స్లో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. నీళ్లు మోసి, ఇస్త్రీ చేసి మరీ ఓట్లు అడుగుతున్నారు.
ఇస్త్రీ చేస్తూ...
జూబ్లీహిల్స్లో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. నీళ్లు మోసి, ఇస్త్రీ చేసి మరీ ఓట్లు అడుగుతున్నారు.
డప్పుల దరువు...
జూబ్లీహిల్స్లో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. డప్పుల దరువేస్తూ వారి ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు.
టిడిపి ప్రచారం..
జంట నగరాల్లో తెలుగుదేశం-బిజెపిలు కూడా తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి.
లోకేష్ ప్రచారం...
తెలుగుదేశం పార్టీ తరపున టిడిపి అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు టిడిపి నేతలు మల్లారెడ్డి, సాయన్నలు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
సుధీర్ రెడ్డి ప్రచారం..
కాంగ్రెస్ పార్టీ ఎల్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో వీధి వీధి తిరుగుతూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
సుధీర్ రెడ్డి కోసం మహిళల ప్రచారం
కాంగ్రెస్ పార్టీ ఎల్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి తరపున నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న మహిళా కాంగ్రెస్ నేతలు.
చిందేశారు..
కాంగ్రెస్ పార్టీ ఎల్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో వీధి వీధి తిరుగుతూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన తరపున ప్రచారం చేస్తున్న మహిళా నేతలు చిందేస్తున్న దృశ్యం.
రంగారెడ్డి ప్రచారం..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ప్రచారంలో భాగంగా రోడ్షో నిర్వహిస్తున్న దృశ్యం.
ఇస్త్రీ చేస్తున్న సాయన్న
తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్లో ఓ దుకాణం వద్ద ఇస్త్రీ చేస్తున్న టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సాయన్న.
శోభానాగి రెడ్డి చిత్ర పటానికి దినేష్ రెడ్డి నివాళి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దినేష్ రెడ్డి కూడా తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. ప్రచారం సందర్భంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శోభానాగి రెడ్డి చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న దృశ్యం.
దినేష్ రెడ్డి ప్రచారం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దినేష్ రెడ్డి కూడా తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న దినేష్ రెడ్డి.
అక్బరుద్దీన్ రోడ్షో
ఎంఐఎం పార్టీ నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలు కూడా తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. రోడ్షో నిర్వహిస్తున్న అక్బరుద్దీన్
అసదుద్దీన్ ప్రచారం
ఎంఐఎం పార్టీ నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలు కూడా తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. రోడ్షోలు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
లక్ష్మణ్ ప్రచారం
భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లక్ష్మణ్ ప్రచారంలో భాగంగా కొబ్బరి బొండా కొడుతున్న దృశ్యం.
దత్తన్న ప్రచారం..
సికింద్రాబాద్ బిజెపి పార్లమెంటు అభ్యర్థి బండారు దత్తాత్రేయ ఇంటింటి ప్రచారం చేపట్టారు. మహిళలను తనకే ఓటు వేయాలని కోరుతున్న దృశ్యం.
దోశ వేశారు...
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా దోశ వేస్తున్న దృశ్యం.
విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారం..
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం.
మైనంపల్లి రోడ్షో
టిఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు రోడ్షో. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు. అభిమానులు.