నా ట్రాక్ రికార్డును దెబ్బ తీసింది - ఏపీలో వైసీపీతో : ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలతో..!!
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన ట్రాక్ రికార్డు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. తాను 2011 నుంచి 2021 మధ్య కాలంలో ఏ పార్టీ కోసం రాజకీయ భాగస్వామిగా పని చేసిందీ.. ఎక్కడ ఏం జరిగిందీ వివరించారు. బిహార్ రాష్ట్రంలో మార్పు కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు..అందు కోసం పాదయాత్ర చేస్తానని కొద్ది కాలం క్రితం ప్రకటించిన ప్రశాంత్ కిషోర్ వైశాలి జిల్లాలో ఓ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పార్టీ తన ట్రాక్ రికార్డును దెబ్బతీసిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ తాను మునిగిపోవడమే కాకుండా.. తోటివారినీ ముంచేస్తోందంటూ వ్యాఖ్యానించారు.

2019లో వైసీపీ గెలుపులో..
అందుకే ఆ పార్టీతో పనిచేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 2017 యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పనిచేసి ఓడిపోయినట్లు చెప్పిన ఆయన.. దీని ఫలితంగానే ఆ పార్టీతో పనిచేయకూడదని నిశ్చయించుకున్నట్లు వెల్లడించారు. 2011 నుంచి 2021 మధ్య 11 ఎన్నికలతో తాను భాగస్వామ్య బాధ్యతలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేసారు.
వరుసగా జరిగిన ఎన్నికల్లో ఒక చోట మాత్రమే ఓడిపోయిన విషయాన్ని వివరిస్తూ.. కారణాలను సైతం విశ్లేషించారు. 2015లో బిహార్లో మహాఘట్బంధన్ను గెలిపించామన్నారు. 2016లో పంజాబ్ ఎన్నికల్లో గెలిచిన విషయాన్ని ప్రస్తావించారు. 2019లో ఏపీ లో వైసీపీతో కలిసి పని చేసి గెలిచిన విషయాన్ని ప్రశాంత్ కిషోర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2020లో దిల్లీ, 2021లో తమిళనాడు, బంగాల్ రాష్ట్రాల్లో వరుస విజయాల గురించి వివరించారు.

కాంగ్రెస్ తో అందుకే దూరం
2017లో యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పనిచేశామని చెబుతూ... అక్కడ ఓడిపోయామని చెప్పారు. అందువల్లే కాంగ్రెస్తో పనిచేయకూడదని అనుకున్నట్లుగా అసలు విషయాన్ని బయట పెట్టారు. పదేళ్లలో తాను 11 ఎన్నికల్లో పాల్గొంటే ఒక్కటే ఓడిపోయామని.. అది కూడా కాంగ్రెస్తో కలిసినప్పుడే ఓడిపోయిన విషయాన్ని వివరిస్తూ..తన ట్రాక్ రికార్డును వారు దెబ్బతీశారని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు.
రెండు నెలల క్రితం ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. పార్టీ అధినేత్రి సోనియాతో సమావేశం అయ్యారు. పార్టీలో మార్పులు అవసరమని వివరిస్తూ.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఇచ్చారు.

జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక
కానీ, తాను పార్టీలో చేరటం లేదంటూ -తరువాత ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇక, ఆ తరువాత బీహార్ లో పరిస్థితుల పైన ఫోకస్ చేసారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో దాదాపు 18 వేల మందిని కలుస్తానని వివరించారు.
ఇక, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పైన చేసిన వ్యాఖ్యలతో ఆయన 2024 ఎన్నికలకు సైతం కాంగ్రెస్ తో కలిసి కూటమి ఏర్పాటు.. కాంగ్రెస్ తో కలిసి పని చేసే అవకాశాలు లేనట్లుగానే కనిపిస్తోంది. ఇప్పుడు ఈ వ్యాఖ్యల పై రాజకీయంగా చర్చ కు కారణమయ్యాయి.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications