Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో ప్రశాంత్ కిశోర్ గుట్టు రట్టు చేసిన మమత బెనర్జీ

Prashant Kishor: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల గడువు సమీపిస్తోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతోంది. ఆ వెంటనే నామినేషన్ల పర్వం ఆరంభమౌతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్.

నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 25. 26వ తేదీన వాటిని స్క్రూటినీ చేస్తారు. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి 29వ తేదీ వరకు గడువు ఉంటుంది. మే 13వ తేదీన పోలింగ్. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకరవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు షెడ్యూల్ అయింది.

Prashant Kishor is working with TDP-BJP in Andhra says Mamata Banerjee

ఈ పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టమేనంటూ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇదివరకు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో- ఏపీలో ఆయన ఎవరికి వ్యూహకర్తగా వ్యవహరిస్తోన్నారనేది తేటతెల్లం చేశాయి.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అయిదేళ్ల కాలంలో రోడ్లు, రాజధాని నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి పెట్టలేదని, అప్పు తెచ్చయినా ప్రతి నెలా డబ్బులు పంచడానికే ప్రాధాన్యత ఇస్తోన్నారని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం కోసం పని చేసిన ప్రశాంత్ కిశోర్.. ఇప్పుడు ప్రతికూలంగా వ్యాఖ్యలు చేయడం అప్పట్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.

ప్రశాంత్ కిషోర్ వ్యవహారంపై తాజాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పందించారు. ఓ బెంగాలీ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్.. తమ పార్టీ కోసం పని చేయట్లేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

Prashant Kishor is working with TDP-BJP in Andhra says Mamata Banerjee

ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్.. ఏపీ రాజకీయాల్లో తలమునకలై ఉన్నారని మమత బెనర్జీ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం- భారతీయ జనతా పార్టీ కోసం పని చేస్తోన్నారని స్పష్టం చేశారు. ఐప్యాక్‌కే చెందిన ప్రతీక్ జైన్, ఆయన టీమ్ తమకు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తోన్నారని తెలిపారు.

ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉన్నాడని, ఆ కారణంతోనే ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలు మళ్లీ విజయం సాధిస్తాయంటూ చెబుతున్నాడని మమత బెనర్జీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియాకు వ్యతిరేకంగా ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు చేయడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించలేదని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+