కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వింత పూజ: ఒంటిపై తేళ్లను పాకించుకుంటారు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబద్: వందలాది మంది భక్తులు ఒంటిపై తేళ్లను ఒంటిపై పాకించుకుంటూ భక్తిపారవశ్యంతో మునిగిపోయే సంఘటన గురించి ఆంధ్రభూమి తెలుగు దినపత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. గుండుపై తేళ్లను పాకింటుకుంటున్న ఓ భక్తును ఫొటోను కూడా ఆ పత్రిక ప్రచురించింది.

Prayers will be performed with scorpions

ఆ పత్రిక వార్తాకథనం ప్రకారం - కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణ శివారులోని కొండపై వెలిసిన కొండరాయుడుకు శ్రావణమాసంలో భక్తులు తేళ్లతో పూజలు చేస్తారు. మూడవ సోమవారం పెద్దసంఖ్యలో కొండపైకి చేరుకునే భక్తులు అక్కడి రాళ్ల కింద ఉండే తేళ్లను పట్టుకుని స్వామివారి మూలవిరాట్‌పై వేసి పూజలు చేశారు.

అనంతరం వాటిని తమ ఒంటిపై వేసుకుని భక్త్భివాన్ని చాటుకున్నారు. ఈరోజు కొండపై కనిపించిన తేళ్లను పట్టుకున్నా కుట్టవని, ఒకవేళ కుట్టినా విషం ఎక్కదని, ఇదే ఇక్కడి మహత్యమని భక్తుల విశ్వాసమని ఆ పత్రిక రాసింది.

English summary

 According to AndhraBhoomi Telugu daily - public perform pujas at Kodumuru's Kondarayudu temple in Kurnool district with scorpions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X