రుణమాఫీకి రూ.5వేల కోట్లు: ఎపి వ్యవసాయ బడ్జెట్
పావలా వడ్డీకే రుణాలు
ఆంధ్రప్రదేశ్ రైతులకు రూ.3 లక్షల వరకు పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. సకాలంలో రుణాలు తిరిగి చెల్చించిన రైతులకే పావలా వడ్డీ రుణం వర్తిస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత కొడిగుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం తొలి స్థానంలో ఉందని చెప్పారు మాంసం ఉత్పత్తిలో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని పుల్లారావు చెప్పారు. పట్టు ఉత్పత్తిలో ముందంజలో ఉండేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
రైతులకు 9 గంటలు విద్యుత్తు
రైతులకు 9 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు కృషి చేయనున్నట్లు పత్తిపాటి పుల్లారావు చెప్పారు. మత్స్య ఉత్పత్తుల విలువలో దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 4.04 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారని, మత్స్య రంగానికి బడ్జెట్లో రూ.60.07 కోట్లు కేటాయిస్తున్నామని మంత్రి చెప్పారు.
10 వేల సోలార్ పంపుసెట్లు
వచ్చే ఐదేళ్లలో పది వేల కొత్త సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇక్రిశాట్ సేవలను వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వినియోగించుకుంటామని మంత్రి చెప్పారు భూసార ఆరోగ్యపత్రం ద్వారా రైతులకు భూసార ఫలితాలు తెలియజేసి అవగాహన కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యానవన, పశుసంవర్ధక, అటవీ, పట్టు, మత్స్య ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారా రాష్ట్ర స్థూల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు.
పావలా వడ్డీకి రూ.230 కోట్లు
ఉత్పాదక పెంపుదలకు రూ.153.23 కోట్లు
వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధికి రూ.192 కోట్లు
పట్టు పరిశ్రమకు రూ. 122 కోట్లు
సమగ్ర ఉద్యానవన అభివృద్ధికి రూ.34 కోట్లు
ఉద్యానవన విశ్వవిద్యాలయానికి రూ.30 కోట్లు
రైతుల ఉచిత విద్యుత్తుకు రూ.3,188 కోట్లు
సహకార శాఖరు రూ.156 కోట్లు
వ్యవసాయంతో ఉపాధఇ హామీ ఇనుసంధానానికి రూ.1,388 కోట్లు
వెంకటేశ్వర పశు విద్య విశ్వవిద్యాలయానికి రూ.112 కోట్లు
పశు సంవర్ధక శాఖకు రూ. 723 కోట్లు
పశుగణ అధునాతన పరిశోధన కేంద్రానికి రూ.15 కోట్లు