పని చేయలేదని, ఇన్నాళ్లకు తెలిసి వచ్చిందా: బాబుపై పురంధేశ్వరి
కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు పురంధేశ్వరి బుధవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు సవరించాలని ఆమె ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు పురంధేశ్వరి బుధవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు సవరించాలని ఆమె ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
సొంత కంపెనీ నిర్లక్ష్యం: టీడీపీ ఎంపీ సీఎం రమేష్పై బాబు ఫైర్
ఇప్పుడు గుర్తుకు వచ్చిందా
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్ట్రాయ్ పని చేయలేదని ఇన్నాళ్లకు మీకు గుర్తుకు వచ్చిందా అని నిలదీశారు.
Recommended Video
గడ్కరీకి విజ్ఞప్తి
2013 భూసేకరణ చట్టం ప్రకారం అంచనాలు పెంచాలని పురంధేశ్వరి.. గడ్కరీకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. 2019 నాటికి పోలవరం పూర్తి కావడానికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ట్రాన్స్ట్రాయ్ పనులు చేయలేకపోతోంది
రాయలసీమ, కృష్ణా డెల్టాలకు పోలవరం నిర్మాణం ఎంతో అవసరమని పురంధేశ్వరి లేఖలో పేర్కొన్నారు. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ పనులు చేయలేకపోతోందని ఆమె పేర్కొన్నారు.
మూడేళ్లకు తెలిసిందా
ట్రాన్స్ట్రాయ్ సంస్థకు పోలవరం పనులు చేయలేకపోతోందని రాష్ట్ర ప్రభుత్వానికి మూడేళ్లకు తెలిసిందా అని పురంధేశ్వరి ప్రశ్నించారు. అర్హత లేని ట్రాన్స్ట్రాయ్కు పోలవరం కాంట్రాక్ట్ పనులు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. అంచనాలు పెంచాలని కేంద్రాన్ని అడగాల్సిన ప్రభుత్వం 60సీ కింద ట్రాన్స్ట్రాయ్కు నోటీసులు ఇచ్చిందన్నారు.