శ్రీవారి సేవలో పీవీ సింధు, ఎమ్మెల్యే రోజా: పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: రియో ఒలింపిక్స్లో భారత్కు రజత పతకం అందించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తల్లిదండ్రులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 68 కిలోల బెల్లంతో శ్రీవారికి తులాభారం మొక్కు చెల్లించుకున్నారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి, వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కే రోజా దర్శించుకున్నారు. ప్రముఖులకు టిటిడి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

పెరగనున్న భక్తుల రద్దీ
ఏడుకొండల వెంకన్న కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం తెల్లవారు జాము నుంచి 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
శనివారం ఒక్కరోజే వెంకన్నను 76,137 మంది భక్తులు దర్శించుకున్నట్లుగా తెలుస్తుంది. కాగా ఆదివారం, సోమవారం వరుస సెలవు దినాలు కావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications