తెలుగు రాష్ట్రాల్లో హైస్పీడ్ రైల్వే లైన్, నాలుగు గంటల్లోనే - గ్రీన్ సిగ్నల్..!!
తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఏపీ, తెలంగాణల్లో రెండు సూపర్ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలిపింది. ఆరు నెలల్లోపు సర్వే పూర్తిచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు రైల్వే బోర్డు లేఖ రాసింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం రెండు లైన్లను ఎంపిక చేసారు. తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్ కోచ్ వందేభారత్ ను ప్రవేశ పెట్టనున్నారు.
సూపర్ ఫాస్ట్ లైన్ దిశగా:తెలుగు రాష్ట్రాల్లో కొంత కాలంగా రైల్వే ప్రాజెక్టులపై రైల్వే శాఖ వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్నాయి. ఈ నెలాఖరులో సికింద్రాబాద్ - నాగపూర్ వందేభారత్ పట్టాలెక్కనుంది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి బెంగుళూరు, భువనేశ్వర్, పూణేకు కొత్త వందేభారత్ ను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు మొదలైంది. ప్రస్తుతం ప్రతిపాదించిన కొత్త హైస్పీడ్ కారిడార్ సర్వే అంశంలోనూ ఈ ప్రతిపాదన చేసారు. ఈ హైస్పీడ్ లైన్ సర్వే పూర్తయితే..220 కిలో మీటర్ల సామర్ధ్యంతో నూతన కారిడార్లను నిర్మించనున్నారు. దీని ద్వారా 200 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే వందేభారత్ స్లీపర్ కోచ్ లో తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి రానున్నాయి.

నాలుగు గంటల్లోనే విశాఖకు:తెలుగు రాష్ట్రాల్లో సూపర్ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు పై కీలక నిర్ణయం జరిగింది. ప్రతిపాదిత శంషాబాద్ - విజయవాడ- విశాఖపట్నం, అదే విధంగా కర్నూలు- విజయవాడ సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల కోసం ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ సర్వే చేపట్టేందుకు రైల్వే బోర్డు అనుమతి ఇచ్చింది. ప్రక్రియ పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు మంజూరుపై నిర్ణయం తీసుకోనుంది. ఇవి కార్యరూపం దాలిస్తే తెలుగు రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. నాలుగు గంటల్లోనే విశాఖకు చేరుకొనే వెసులు బాటు కలుగుతుంది. ఈ రెండు లైన్ల పరిధిలో మొత్తం 942 కి.మీ మార్గంలో గరిష్ఠంగా 220 కిమీ వేగంతో ప్రయాణించేలా రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేను ఆరు నెలల్లో పూర్తిచేయనున్నారు.
వందేభారత్ స్లీపర్ కోచ్ :తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రైల్వే రూట్ల సామర్ధ్యం ప్రస్తుతం 110 నుంచి 150 కిలో మీటర్ల లోపే ఉంది. శంషాబాద్ - విజయవాడ- విశాఖ, అదే విధంగా కర్నూలు- విజయవాడ మధ్య గంటకు 220 కిలో మీటర్ల వేగంతో రైళ్లను నడిపేందుకు కొత్త మార్గాలను సిద్దం చేయాలనేది రైల్వే శాఖ ఆలోచన. ఇందుకు ఈ మార్గాల్లో ఏయే ప్రాంతాల మీదుగా ఎలైన్ మెంట్ చేయాలనే అంశం పైన ఇప్పటికే గుత్తేదారులను ఎంపిక చేసింది. ఆరు నెలల్లో గుత్తేదారు నివేదిక ఇవ్వనున్నారు. ఈ లైన్ కు ఆమోదం పొందింతే హై స్పీడ్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్ కోచ్ వందేభారత్ రైళ్లను అందుబాటులో కి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications