ఏపీ నుంచి బెంగళూరు కు వందేభారత్ - రూట్ ఫిక్స్..!!
ఏపీ నుంచి త్వరలో మరో కొత్త వందేభారత్ అందుబాటులోకి రానుంది. తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ కు ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రయాణీకుల నుంచి ఆదరణ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ప్రారంభించిన వందేభారత్ రైళ్లతో మరిన్ని మార్గాల్లో ప్రారంభానికి డిమాండ్ పెరుగుతోంది. ఇదే సమయంలో విజయవాడ నుంచి గుంటూరు మీదుగా బెంగళూరుకు కొత్త వందేభారత్ ఏర్పాటు పైన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రూట్ పైన ఒక నిర్ణయానికి వచ్చారు. త్వరలోనే ఈ రైలు ప్రారంభం పైన అధికారికంగా నిర్ణయం వెలువడనుంది.
విజయవాడ టు బెంగళూరు
వందేభారత్ రైళ్లకు తెలుగు రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. విశాఖ - సికింద్రాబాద్ అదే విధంగా సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ కు ఆశించిన స్థాయిలో ఆదరణ కనిపిస్తోంది. ఇక, విజయవాడ నుంచి చెన్నై మధ్య నడుస్తున్న వందేభారత్ కు ఆదరణ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరుకు కొత్త సర్వీసు కావాలనే డిమాండ్ పెడింగ్ లో ఉంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న కాచిగూడ - యశ్వంత్ పూర్ వందేభారత్ కు ఆక్యెపెన్సీ రేషియో పెరుగుతోంది. అయితే, ఏపీ నుంచి బెంగళూరుకు కొత్త వందేభారత్ పైన ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి.

తాజా చర్చలతో
తాజాగా, టీడీపీ లోక్ సభ పార్టీ నేత..ఎంపీ లావు శ్రీక్రిష్ణ దేవరాయులు రైల్వే మంత్రితో ఈ లైన్ లో ప్రతిపాదన పైన మరోసారి చర్చించారు. ఇప్పటికే రూట్ .. అవసరాలు.. డిమాండ్ పైన వివరంగా నివేదిక ఇచ్చిన ఎంపీ... తాజాగా పార్లమెంట్ లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. గుంటూరు నుంచి బెంగళూరుకు ప్రస్తుతం రైల్వే ప్రయాణం ఆశించిన స్థాయిలో లేదని.. ప్రయాణీకుల ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. గుంటూరు నుంచి బెంగళూరు కు దాదాపు 16 గంటల సమయం తీసుకుంటోందని వివరించారు. దీంతో, ఈ రూట్ లో వందేభారత్ అసవరం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన పైన రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు.
రూటు ఖరారు
కాగా, ఇప్పటికే రైల్వే అధికారులు సైతం ఈ రైలు ఏ మార్గంలో నడపాలనే దాని పైన ప్రాధమికంగా నివేదిక సిద్దం చేసారు. గుంటూరు నుంచి పల్నాడు ప్రాంతం మీదుగా నంద్యాల, డోన్, గుంత కల్లు, అనంతపురం, హిందూపురం, యలహంకలో స్టాపులు ఉండేలా ప్రతిపాదించారు. దీని పైన త్వరలోనే రైల్వే శాఖ అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మార్గం లో కొత్తగా వందేభారత్ నడిపేందుకు సాంకేతిక అంశాల పైన నివేదిక కోరినట్లు సమాచారం. వీటిని పరిశీలించిన తరువాత ఈ నెలాఖరులో లోగా వందేభారత్ కొత్త రైలు పైన నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications