విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!!
రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగు తున్న వేళ.. మరింత విస్తరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రస్తుతం విశాఖ నుంచి సికింద్రాబాద్ వరుకు నడుస్తున్న వందేభారత్ కు మరో ప్రధాన స్టేషన్ లో హాల్టింగ్ సౌకర్యాన్ని కల్పించింది. అదే విధంగా ప్రస్తుతం స్పెషల్ రైళ్లుగా నడుస్తున్న తొమ్మది ఎక్స్ ప్రెస్ లను రెగ్యులర్ రైళ్లుగా మార్పు చేసారు. ప్రయాణీకుల నుంచి వస్తున్న ఆదరణ మేరకు ఈ నిర్ణయాల అమలుకు సిద్దమయ్యారు.
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇక నుంచి తాడేపల్లి గూడెం రైల్వే స్టేషన్లో కూడా ఆగనుంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి భూపతిరాజు వెల్లడించారు. స్థానికుల నుంచి వచ్చిన వినతులను రైల్వేశాఖ దృష్టికి భూపతిరాజు తీసుకెళ్లటంతో.. రైల్వేశాఖ ఈ మేరకు సానుకూలంగా స్పందించింది. దీంతో తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు వందే భారత్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. తాడేపల్లిగూడెం కు వందేభారత్ రాకపోకల వేళలను రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించనుంది. అదే విధంగా రైల్వేకు సంబంధించి కీలక అంశాలను మంత్రి భూపతిరాజు వెల్లడించారు. గతంలో ఉన్న 9 ప్రత్యేక రైళ్లను ఇప్పుడు రెగ్యులర్ సర్వీసులుగా మార్చినట్లు ప్రకటించారు. సికింద్రాబాద్- అనకా పల్లి (17043/44), చర్లపల్లి - భువనేశ్వర్ న్యూ ఎక్స్ప్రెస్ (17067/68) రైళ్లు ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు.

రెగ్యులర్ ఎక్స్ ప్రెస్ లుగా తొమ్మది స్పెషల్ ట్రైన్స్
అదే విధంగా చర్లపల్లి - అనకాపల్లి (17045/46), చర్లపల్లి - అ నకాపల్లి (17053/54), కాకినాడ టౌన్ - హిసార్ ఎక్స్ప్రెస్ (17 295/96) రైళ్లు తాడేపల్లిగూడెంలో నిలుపుదల సౌకర్యం కలిగి ఉన్నాయన్నారు. నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల ప్రయాణికుల కోసం తిరుపతి - నరసాపురం (17427/28) రైలు ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం, పాలకొల్లు, నరసాపురం స్టేషన్లలో ఆగుతుందన్నారు. కాకినాడ టౌన్ - లింగంపల్లి (12775/76), కాకినాడ టౌన్ - మైసూర్ ఎక్స్ప్రెస్ (17289/90) రైళ్లు తణుకు, భీమవరం టౌన్, ఆకివీడులో నిలుస్తాయని తెలిపారు. చర్లపల్లి - న రసాపురం ఎక్స్ప్రెస్ (17061/62) రైలు ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు, నరసా పురం స్టేషన్లలో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని మంత్రి శ్రీనివాస వర్మ వివరించారు. జాతీయ రహదారి -165 నిర్మాణ పనులు రెండు దశాబ్దాలుగా పెండింగ్లో ఉందని, త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు.
-
తిరుమల ప్లాన్ చేసుకుంటున్న వారికి రైల్వే బిగ్ అప్డేట్, కొత్తగా అందుబాటులలోకి..!! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్











Click it and Unblock the Notifications