తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 11 వరకు ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రద్దు..!!

రైల్వే ప్రయాణీకలకు బిగ్ అలర్ట్. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేస్తూ రైల్వే అధికారులు ప్రకటన చేసారు.విజయవాడ డివిజన్ పరిదిలోని నిడుదవోలు - కడియం మధ్య ఆదునీకరణ పనుల కారణంగా ఈ నెల23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. వీటిలో కీలకమైన రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి ఎక్స్ ప్రెస్ లు ఉన్నాయి. దీంతో..ప్రయాణీకుల్లో ఆందోళన మొదలైంది. రద్దైన రైళ్ల వివరాలను అధికారులు ప్రకటించారు.

ఈ నెల 24 నుంచి ఆగస్టు 10 వరకు రాజమహేంద్ర వరం - విశాఖ (07466) ప్యాసింజర్, విశాఖ - రాజమహేంద్రవరం( 07467) ప్యాసింజర్, గుంటూరు - విశాఖ (17239)సింహాద్రి, విశాఖ గుంటూరు స(17240) సింహాద్రి, విజయవాడ -విశాఖ (12718) రత్నాచల్ ఎక్స్ ప్రెస్, విశాఖ - విజయవాడ (12717) రత్నాచల్ ఎక్స్ ప్రెస్, గుంటూరు - విశాఖ (22702) ఉదయం ఎక్స్ ప్రెస్, విశాఖ - గుంటూరు (22701) ఉదయ్ ఎక్స్ ప్రెస్, విశాఖ తిరుపతి (22707) డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Railways Cancel main express trains in route of Vizag up to 11th August due to technical works

అదే విధంగా ఈ నెల 23 నుంచి ఆగస్టు 10 వరకు మచిలీపట్నం - విశాఖ (17219), విశాఖ - మచిలీపట్నం (17220) ఎక్స్ ప్రెస్ లు, గుంటూరు - రాయగడ (17243), విశాఖ - లింగంపల్లి(12805) జన్మభూమి ఎక్స్ ప్రెస్ రద్దయ్యాయి. వీటితో పాటుగా ఈ నెల 24 నుంచి ఆగస్టు 11 వరకు రాయగడ - గుంటూరు (17244), లింగంపల్లి -విశాఖ (12806) జన్మభూమి ఎక్స్ ప్రెస్ లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 24 నుంచి ఆగస్లు 9 వరకు తిరుపతి - విశాఖ (22708) డబల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ రద్దయింది. దీంతో..విశాఖ కు రాకపోకలు సాగించే ప్రయాణీకులకు సమస్యలు తప్పేలా లేవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+