Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సొంత మ్యానిఫెస్టో రిలీజ్ చేసిన వైసీపీ అభ్యర్థి

ఏపీలో ఎన్నికల వేడి మరింత పెరిగింది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో నేతలందరూ కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నెల 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడునున్నాయి. ఈక్రమంలో పార్టీల అధినేతలు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ప్రధాన పార్టీలన్నీ కూడా తమ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేశాయి. ముఖ్యంగా అధికార వైసీపీ మ్యానిఫెస్టో కోసం సామాన్య ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు, మేధావులు ఎంతో అతృతుగా ఎదురు చూశారు.ఇదే సమయంలో వైసీపీ మ్యానిఫెస్టో విడుదల జాప్యం కావడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి.

గత ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ నవరత్నాల పేరిట ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారు. ఈసారి అంతకు మించి సంక్షేమం ఉంటుందని అంతా భావించారు. అయితే గత ఐదు సంవత్సరాలుగా అమలు చేస్తోన్న నవరత్నాలను మరింత మెరుగ్గా అమలు చేస్తామని మాత్రమే జగన్ ప్రకటించారు. గత మ్యానిఫెస్టోకే కొద్దిపాటి కేటాయింపులు పెంచి.. చిన్న చిన్న మార్పులతో కొత్త మ్యానిఫెస్టోను ప్రకటించారు.తాజాగా వైసీపీ అభ్యర్థి తన నియోజకవర్గానికి సంబంధించి సొంత మ్యానిఫెస్టోను విడుదల చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ సొంత ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. ఆయన గత ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.

Rajahmundry MLA candidate Margani Bharat announced her election manifesto
ఈసారి ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మార్గాని భరత్ సన్నద్ధం అవుతున్నారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద భారీ జన సందోహం మధ్య నగర ప్రముఖుల సమక్షంలో భరత్ 10 ప్రామిస్ పేరుతో ఈ మేనిఫెస్టోను ఆవిష్కరించారు.ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా నగరంలో రౌడీ షీటర్స్, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వంటి సంఘ విగ్రహ శక్తులను నగర బహిష్కరణ చేస్తానని ఆయన ప్రకటించారు. ప్రశాంతమైన నగరంగా రాజమండ్రిని ఉంచడంతో పాటు.. నగరవాసులకు 24 గంటలు మంచినీటి సరఫరా, నగరంలోని యువతకు పదివేల ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఈ ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించినట్టు భరత్ తెలిపారు.

గోదావరిలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయడం తన సంకల్పమని భరత్ పేర్కొన్నారు.స్పోర్ట్స్ హబ్ గా రాజమండ్రిని తీర్చిదిద్దడం, రెండు మూడు సాఫ్ట్ వేర్ కంపెనీలు తీసుకురావడం, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంక్యుబేషన్ సెంటర్స్ తీసుకురావడం, జగనన్న కాలనీలలో 40 వేల మందికి ఇళ్లు కట్టించి లబ్ధిదారులకు అప్పగించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు..అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మిస్తామని, ప్రతిరోజు గుడ్ మార్నింగ్ , రాజన్న రచ్చబండ కార్యక్రమాలు , వారం వారం అధికారులతో రివ్యూ నిర్వహించి ప్రజాసమస్యలు పరిష్కరిస్తారని భరత్ పేర్కొన్నారు.సిటి ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకునై ప్రజలకు సేవలు అందిస్తానని రాజమండ్రిని విశ్వ నగరంగా అభివృద్ధి చేస్తానని భరత్ ప్రకటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+