వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కసాయిని నమ్మినట్లే, ముగ్గురి కుట్ర టి: జగన్‌పై టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajendra Prasad blames YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని నమ్మితే కసాయిని నమ్మినట్లేనని తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులు రాజేంద్ర ప్రసాద్ ఆదివారం మండిపడ్డారు. జగన్ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్ద తాకట్టు పెడతారన్నారు.

జగన్‌ను సమైక్యవాదులు, సీమాంధ్ర ప్రజలు నమ్మితే కసాయివారిని నమ్మినట్లే అన్నారు. సమైక్యాంధ్ర కోసం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయవద్దని సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి చెబుతుంటే వైయస్ జగన్ మాత్రం రాజీనామాలకు డిమాండ్ చేయడంలో అర్థమేమిటో చెప్పాలన్నారు.

విభజనకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, సోనియా గాంధీ, వైయస్ జగన్మోహన్ రెడ్డిలు కలిసి కుట్ర చేస్తున్నారన్నారు. విభజన నిర్ణయం వారి ముగ్గురు ఉమ్మడి ప్రణాళికే అని దుయ్యబట్టారు.

తెరాస, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు కుట్రలో భాగంగానే రాష్ట్రపతి పాలన తెరపైకి వస్తోందని టిడిపి శాసన మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు వేరుగా ధ్వజమెత్తారు.

English summary
Telugudesam Party senior leader Rajendra Prasad on Sunday blamed YSR Congress Party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X