బుడమేరు గండ్ల పూడ్చివేత వేళ బిగ్ అలర్ట్..!!
విజయవాడను ముంచెత్తిన బుడమేరు గండ్లు ఇంకా టెన్షన్ పెంచుతున్నాయి. బుడమేరు వరద కొనసాగుతోంది. నందివాడ మండలంలోని 12 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. జాతీయ రహదారిపై రెండు నుంచి నాలుగు అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. బుడమేరుకు మూడు గండ్లు పడటంతో ప్రభుత్వం సైన్యం సహకారంతో పూడ్చివేత పనులు కొనసాగిస్తోంది. అక్కడే మకాం వేసిన మంత్రి రామానాయుడు ఈ సాయంత్రానికి పూడ్చివేత పనులు పూర్తవుతాయని వెల్లడించారు.
గండ్లు పూడ్చివేత
బుడమేరు ప్రవాహం పైన ప్రభుత్వం అప్రమత్తమైంది. శాంతించినట్లు కనిపిస్తున్నా...పూర్తిగా ముప్పు తొలిగిపోలేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇంకా 12 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలకు పడవల ద్వారానే ఆహారం... ఇతర సహాయ కార్యక్రమాలను అధికారులు అందిస్తున్నారు. వినాయక చవితి పండుగకు బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు దూరమయ్యాయి. విజయవాడ నగరంలో శుక్రవారం రెండు అడుగుల మేర వరద నీరు పెరగటంతో స్థానికులు మరోసారి ఆందోళన చెందారు.

సైన్యం సహకారం
విజయవాడను ముంచేసిన బుడమేరు గండ్ల పూడ్చివేత పై ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మూడు గండ్లు పడటంతో వాటిని పూడ్చేందుకు నాలుగు రోజులుగా ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోంది. మంత్రి రామానాయుడు అక్కడే మకాం వేసారు. బుడమేరు మూడో గండి పుడ్చివేత 90 శాతం పూర్తి అయ్యిందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇంకో రెండు మూడు గంటల్లో గండ్లు పూడ్చివేత పనులు పూర్తి అవుతాయన్నారు. మిగిలిన 10శాతం ఇంకో రెండు గంటల్లో పూర్తి చేసి దిగువ ప్రాంతాలకు వెళ్లే వరద నీటిని అరికడతామని మంత్రి తెలిపారు.
#విజయవాడ లో #వరదముంపు లో నానుతున్న వేలాది మందికి ఉపశమనం, వరదకు అడ్డుకట్ట వేయాలంటే #బుడమేరు గండ్లు పూడిక పనులు ద్వారా నియంత్రించవచ్చుననే చంద్రబాబు సంకల్పాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రతిరోజు #వర్షం, #వరద వెంటాడుతున్న లెక్కచేయకుండా రాత్రింబవళ్లు గట్టుపైనే గడుపుతూ, పట్టు వదలని… pic.twitter.com/cN6exvF4mI
— Nimmala Ramanaidu (@RamanaiduTDP) September 6, 2024
.
నేటితో పనుల పూర్తి
గండ్లు పూడ్చివేత కోసం సైన్యం కూడా రంగంలోకి దిగింది. మద్రాస్ రెజిమెంట్ నుంచి 120 మంది అధికారులు, ఆర్మీ జవాన్లు వచ్చారు. గండ్ల వద్ద సమస్య పరిష్కరించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. బుడమేరు గండ్లను గేబియాన్ బుట్టల (ఇనుప చువ్వలతో బుట్టలా చేసి దానిని పెద్ద రాళ్లు, ఇసుక బస్తాలతో నింపుతారు) ద్వారా పూడ్చాలని నిర్ణయించినట్లు సైన్యం వెల్లడించింది. బుట్టలను పటిష్టం చేసేందుకు 4 మీటర్ల వరకు రక్షితకట్ట నిర్మిస్తున్నారు. మూడో గండి పూడ్చివేత ద్వారా బుడమేరు ముంపు సమస్య ప్రస్తుతానికి పరిష్కారం అయినట్లేనని యంత్రాంగం భావిస్తోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications