రాహుల్ గాంధీ సభ: ఉండవల్లి స్థానంలో రాపోలు
మహబూబ్ నగర్: కాంగ్రెసు పార్టీ నిర్వహించే సభల్లో ఇంతకుముందు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వంటి అగ్రనేతల ప్రసంగాన్ని నాటి కాంగ్రెసు పార్టీ నేత, నేటి జై సమైక్యాంధ్ర పార్టీ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ హిందీ నుండి తెలుగులోకి అనువాదం చేసేవారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉండవల్లి కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వెళ్లిపోయారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో ఆయన ఉన్నారు. విభజనపై కాంగ్రెసు పార్టీ ఉండవల్లి వంటి నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉండవల్లికి బదులు అనువాదకులుగా రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్ భాస్కర్ వచ్చారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రాహుల్ గాంధీ బహిరంగ సభలో ఉపాధ్యక్షుడి ప్రసంగాన్ని రాపోలు తెలుగులోకి అనువదించారు. కొద్ది రోజుల క్రితం కరీంనగర్ జిల్లాలో జరిగిన సోనియా గాంధీ సభలో ఆమె ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించే వారు దొరకలేదు. ఇప్పుడు రాపోలు... ఉండవల్లి స్థానాన్ని తెలంగాణలో భర్తీ చేయనున్నారు.
కాగా, సభలో రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల పైన నిప్పులు చెరిగారు. టిడిపి తెలంగాణను అడ్డుకోవాలని చివరి వరకు ప్రయత్నాలు చేసిందని, బిజెపి డబుల్ గేమ్ ఆడిందని, తెలంగాణలో తెరాస పాత్ర లేదని ఆయన అన్నారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications