రాహుల్ గాంధీ సభ: ఉండవల్లి స్థానంలో రాపోలు
మహబూబ్ నగర్: కాంగ్రెసు పార్టీ నిర్వహించే సభల్లో ఇంతకుముందు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వంటి అగ్రనేతల ప్రసంగాన్ని నాటి కాంగ్రెసు పార్టీ నేత, నేటి జై సమైక్యాంధ్ర పార్టీ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ హిందీ నుండి తెలుగులోకి అనువాదం చేసేవారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉండవల్లి కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వెళ్లిపోయారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో ఆయన ఉన్నారు. విభజనపై కాంగ్రెసు పార్టీ ఉండవల్లి వంటి నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉండవల్లికి బదులు అనువాదకులుగా రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్ భాస్కర్ వచ్చారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రాహుల్ గాంధీ బహిరంగ సభలో ఉపాధ్యక్షుడి ప్రసంగాన్ని రాపోలు తెలుగులోకి అనువదించారు. కొద్ది రోజుల క్రితం కరీంనగర్ జిల్లాలో జరిగిన సోనియా గాంధీ సభలో ఆమె ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించే వారు దొరకలేదు. ఇప్పుడు రాపోలు... ఉండవల్లి స్థానాన్ని తెలంగాణలో భర్తీ చేయనున్నారు.
కాగా, సభలో రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల పైన నిప్పులు చెరిగారు. టిడిపి తెలంగాణను అడ్డుకోవాలని చివరి వరకు ప్రయత్నాలు చేసిందని, బిజెపి డబుల్ గేమ్ ఆడిందని, తెలంగాణలో తెరాస పాత్ర లేదని ఆయన అన్నారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications