నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ వద్ద రీ సర్వే, ఆక్రమిస్తే..

హైదరాబాద్: సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు శుక్రవారం రీ-సర్వే ప్రారంభించారు. తుమ్మిడికుంట చెరువును అధికారులు సర్వే చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, సాగునీటి పారుదల శాఖ, రెవెన్యూ అధికారులు ఎన్ కన్వెన్షన్ వద్ద చెరువు రీసర్వే నిర్వహిస్తున్నారు.

తమ్మిడికుంట చెరువు భూమిని ఆక్రమించుకున్నట్లు ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌పై అధికారులు తేల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జున హైకోర్టును ఆదేశించారు. నోటీసులు ఇచ్చాక సర్వే చేయాలని కోర్టు జీహెచ్ఎంసీ అధికారులకు సూచించింది.

Re survey on Nagarjuna's N Convention Centre at Tummidikunta lake

దీంతో ఇటీవల నాగార్జునతో సహా తుమ్మిడికుంట చెరువును పరిధిలోని పలువురికి నోటీసులు ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు చెరువు హద్దులు తేల్చేందుకు అధికారులు రీ-సర్వే నిర్వహిస్తున్నారు. చెరువు పూర్తి స్థాయి నీటిమట్టం వరకు హద్దులు నిర్ధారిస్తున్నారు. సర్వే అనంతరం భూమి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని శేరిలింగంపల్లి తహసీల్దార్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+