ఏపీలో రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతూ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవోలు 393, 94, 95లను విడుదలచేసింది. దీంతో స్టాంప్ డ్యూటీ 4 నుంచి 5 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజును 0.5 శాతం నుంచి ఒక శాతానికి పెంచింది.
ఇక కుటుంబ సభ్యుల మధ్య జరిగే ఒప్పందాలపై ఒక శాతం ఫీజు, ఇతర ఒప్పందాలపై 6 నుంచి 3 శాతానికి ఫీజును సవరించారు. రిజిస్ట్రేషన్ ఫీజులకు సంబంధించి 2013 మార్చి 30న ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన ప్రభుత్వం, తాజా ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతూ తీసుకున్న నిర్ణయ ఫైలుకు జపాన్ పర్యటనకు వెళ్లకముందే సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు కొత్త వాహనాలు:
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం రూ.100 కోట్లతో 2,422 వాహనాలు కొనుగోలు చేయనున్నట్టు తెలిపింది.












Click it and Unblock the Notifications