ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు దర్మరణం
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు దుర్మరణం చెందారు. గుర్తు తెలియని వాహనం.. బైక్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. విశాఖ నగరంలోని పీఎం పాలెం క్రికెట్ స్టేడియం సమీపంలో వీ కన్వెన్షన్ హాల్ ఎదురుగా మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
పీఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి మారికవలసలోని శారదానగర్-2 ప్రాంతానికి చెందిన ధనరాజ్.. స్వతంతర్ నగర్కు చెందిన కే వినోద్ ఖన్నా కలిసి లా కాలేజీ సమంలోని పనోరమ హిల్స్లో ఉన్న స్నేహితుడు ప్రశాంత్ పుట్టిన రోజు వేడుకలకి చేరుకున్నారు. కొద్దిసేపు అక్కడే గడిపిన తర్వాత బైక్లో పెట్రోల్ పోయించుకునేందుకు కొమ్మాది పెట్రోల్ బంక్కు వెళ్లారు.

పెట్రోల్ పోయించుకున్న తర్వాత అక్కడ్నుంచి తిరిగి పనోరమ హిల్స్కు వెళ్లేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో స్టేడియం వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని వాహనం వాళ్ల బైక్ను బలంగా ఢీకొట్టింది. దీంతో ధనరాజ్(22), వినోద్ ఖన్నా(22) అక్కడికక్కడే మృతి చెందారు. ధనరాజ్ ఇన్పోసిస్లో, వినోద్ ఖన్నా స్థానికంగానే రామాటాకీస్ వద్ద ఓ ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు.
ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చేతికందిన ఇద్దరు యువకులు మరణించడంతో మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇద్దరు యువకుల మృతితో మారికవలసలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నాగుల చవితి వేడుకలో అపశృతి
విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి పరిదిలోని పాత వీధిలో జరిగిన నాగుల చవితి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నాగుల చవితి రోజున సంతోష్ అనే వ్యక్తి నోట్లో డీజిల్ పోసుకుని మంటలు ఊదుతూ విన్యాసం చేస్తుండగా అతడికి మంటలు అంటుకున్నాయి. వెంటనే మంటలు ఆర్పేందుకు అక్కడున్నవారు ప్రయత్నించారు.
అయినప్పటికీ మంటలు తగ్గకపోవడంతో సంతోష్కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ముఖం, ఛాతి భాగాలకు మంటలు అంటుకున్నాయి. అక్కడున్న మరికొంత మంది నీళ్లుపోసి మంటలు ఆర్పివేశారు. అప్పటికే సంతోష్కు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం విశాఖపట్నంలోని కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications