సుజాతపై ఫైర్.. రోజాకి షాకిచ్చిన గ్రామస్థులు, జగన్! అడ్డుకోకు: పెట్టుబడులపై డొక్కా
ఏలూరు/విశాఖ: మంత్రి పీతల సుజాత పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సోమవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. సుజాతకు వడ్డాణాలు, డబ్బుల పైన ఉన్న ఆసక్తి ప్రజా సమస్యల పైన లేదని ఎద్దేవా చేశరు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మార్చేది వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డియే అన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ కరువు దాపరిస్తోందని విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రతి ఇళ్లు సౌభాగ్యంగా ఉండేదన్నారు. చంద్రబాబు హయాంలో దౌర్భాగ్యం ఉందని దుయ్యబట్టారు. సుజాతకు చంద్రబాబు భజన తప్ప ఇంకొకటి తెలియదన్నారు.

రోజాను అడ్డుకున్న టిడిపి కార్యకర్తలు
సోమవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో వైసిపి ఎమ్మెల్యే రోజా తలపెట్టిన పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసిపి మండల కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఆమె రాగా.. ఓ దళిత మంత్రిని అవమానపరిచేలా మాట్లాడిన ఆమె క్షమాపణ చెప్పాలని టిడిపి కార్యకర్తలు ధర్నాకు దిగారు.
చింతలపూడిలోకి రోజాను అనుమతించేది లేదని రాస్తారోకో చేశారు. రోజా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో వైసిపి శ్రేణులు కూడా రోడ్డు పైకి రావడంతో వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేసి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.
జగన్ అభివృద్ధిని అడ్డుకోకు: డొక్కా
ఏపీలో పెట్టుబడులకు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ రావు గుంటూరులో అన్నారు. విశాఖ సీఐఐ సదస్సులో ఏపీకి పెట్టుబడులు వరదలా వచ్చి పడుతున్నాయని, అది చంద్రబాబు సమర్థతకు నిదర్శనం అన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధికి జగన్ సహకరించాల్సింది పోయి దుష్ప్రచారం చేయడం తగదన్నారు. అభివృద్ధికి సహకరించకపోయినా అడ్డు తగలొద్దన్నారు.
పెట్టుబడులకు ఏపీ అనుకూలంగా మార్చేందుకు బాబు కృషి: జిఎంఆర్
ఏపీని పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని జిఎంఆర్ ఛైర్మన్ గ్రంథి మల్లిఖార్జున రావు అన్నారు. సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ - విజన్ 2029 అంశంపై చర్చల్లో పాల్గొని ప్రసంగించారు. 2029 నాటికి ఏపీని దేశంలో అగ్రస్థానంలో నిలపాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications