రోజా ఫోన్ చోరీ - ట్రాకింగ్ ద్వారా : ఫైర్ అనేది ఇన్ బిల్ట్ - సీఎంను ఫాలో అవుతా..!!
ఫైర్ బ్రాండ్ రోజా తన ఫైర్ వెనుక కారణం ఏంటనేది బయట పెట్టారు. ఫైర్ అనేది ఇన్ బిల్ట్ అని.. చెడు మీద ఫైర్ అదే విధంగా కంటిన్యూ అవుతుందని చెప్పుకొచ్చారు. తాను ఎప్పుడూ సీఎం జగన్ ను ఫాలో అవుతానని మంత్రి రోజా వెల్లడించారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాలులో మంత్రి రోజా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో క్రీడలను ముందుకు తీసుకెళ్లాలనేది సీఎం జగన్ లక్ష్యంగా చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు.
ప్రతి నియోజకవర్గంలో స్పోర్ట్స్ క్లబ్ అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. యువతీ - యువకులకు సరైన ప్రోత్సాహం ఇవ్వక అనేక మంది వెనుకబడి పోతున్నారని పేర్కొన్నారు. చిన్న విషయాలకే అనేక మంది పిల్లలు డిప్రెషన్ కు గురవుతున్నారని చెప్పారు. అటువంటి సెన్సిటివ్ గా మారుతున్న పిల్లల్లో క్రీడలపైన ఆసక్తి పెంచేలా చేయటం ద్వారా..వారితో మానసిక స్థైర్యం వస్తుందని రోజా పేర్కొన్నారు. మనం చేసే అభివృద్ధి పనులే మనల్ని విమర్శించే వాళ్లకు సమాధానం చెబుతాయంటూ రోజా చెప్పుకొచ్చారు.
అయితే, ఈ సమీక్ష కు ముందు ఎస్వీయూ ఆవరణలో ఆలయానికి రోజా వెళ్లారు. ఆ సమయంలో మంత్రి ఫోన్ మాయం అయినట్లు తెలుస్తోంది. శాప్ సమావేశంలో ఉన్న సమయంలో సెల్ ఫోన్ల గురించి రోజా వివరిస్తున్న సమయంలో ఫోన్ చోరీ అయినట్లుగా గుర్తించారు. ఇది వెంటనే అక్కడ హాట్ టాపిక్ గా మారింది. దీంతో..దీన పైన విచారణ ప్రారంభం అయింది. ట్రాకింగ్ ద్వారా ఫోన్ ఆచూకీ కోసం పోలీసుల యత్నాలు చేయగా.. ఎట్టకేలకు తిరుపతి రూయా సమీపంలో సిగ్నల్ ట్రేస్ చేసినట్లుగా సమాచారం.