గ్రాఫిక్స్కు అలవాటు పడిన ప్రాణాలు వారివి
Rushikonda Buildings: విశాఖపట్నం రుషికొండ వద్ద గత ప్రభుత్వం నిర్మించిన భవనాలు ప్రభుత్వానికి చెందినవేనని వైఎస్ఆర్ కాంగ్రెెస్ పార్టీ సీనియర్ నాయకుడు మజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. వాటిని ఎలా ఉపయోగించుకోవాలనే విషయంపై ముంద ఆలోచన చేయాలని సూచించారు.
రుషికొండ వద్ద నిర్మించిన భవనాలను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సొంత ప్యాలెస్ అంటూ తెలుగుదేశం పార్టీ చేస్తోన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. అధికారంలో ఎవరు ఉన్నా వారికి ఆ భవనాలు చెందుతాయని చెప్పారు. మున్ముందు ఆ భవనాలను ఎలా వినియోగించుకోవాలనే విషయాన్ని మానేసి జగన్ ఇంటిగా చూడటం సరికాదని చెప్పారు.

విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా మార్చాలనే కాన్సెప్ట్ ఉండటం వల్ల అక్కడికి వచ్చే వారి కోసం రుషికొండలో ఈ భవనాల అవసరం అవుతుందని జగన్ భావించారని, అందుకే వాటిని నిర్మించారని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖపట్నం నుంచే పరిపాలన సాగించేలా తమ ప్రభుత్వం చర్యలు సైతం తీసుకుందని గుర్తు చేశారు.
2014 నుంచి 2019 వరకు అధికారంలో చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలను ధారబోసి అన్నీ తాత్కాలిక భవనాలను నిర్మించారని అమర్నాథ్ గుర్తు చేశారు. 600 కోట్ల రూపాయలతో తాత్కాలిక సచివాలయం కట్టాడని చెప్పారు. ఇది తాత్కాలిక సచివాలయం అని చంద్రబాబే స్వయంగా ఒప్పుకొన్నాడని చెప్పారు.

కోట్ల రూపాయల వ్యయంతో కట్టిన హైకోర్టు భవనం కూడా తాత్కాలికమేనని అమర్నాథ్ అన్నారు. తమ ప్రభుత్వం అలా కాదని, విశాఖపట్నాన్ని రాజధానిగా మార్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, అధికార నివాసాలను రుషికొండ వద్ద శాశ్వత భవనాలుగా నిర్మించామని చెప్పారు.
తన అయిదు సంవత్సరాల హయాంలో చంద్రబాబు గ్రాఫిక్స్తో మాయాజాలం సృష్టించాడంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎద్దేవా చేస్తోన్నారు. జగన్ తన ప్రభుత్వ హయాంలో కళ్లు చెదిరేలా శాశ్వత కట్టడాలను కట్టడంతో గ్రాఫిక్స్కు అలవాటు పడిన వారి ప్రాణాలు తట్టుకోలేకపోతున్నాయంటూ చురకలు అంటించారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications